సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’తో అదిరిపోయే హిట్ అందుకున్నాడు.ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన మహేష్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు.
కాగా ప్రస్తుతం నెలకొన్న లాక్డౌన్ కారణంగా మహేష్ ఇంటికే పరిమితం అయ్యి కుటుంబంతో గడుపుతున్నాడు.
అయితే ఈ లాక్డౌన్ సమయాన్ని కూడా మహేష్ అండ్ టీమ్ పూర్తిగా వాడుకుంటోంది.
ఇటీవల యూట్యూబ్లో శ్రీమంతుడు చిత్రం 100 మిలియన్ వ్యూస్ మార్క్కు చేరుకోవడంతో ఈ అంశానికి సంబంధించి ఓ ప్రత్యేక పోస్టర్తో ప్రమోట్ చేశారు.దీంతో కొందరు నెటిజన్లు మహేష్కు అదిరిపోయే కౌంటర్ ఇస్తు్న్నారు.
‘‘యూట్యూబ్లో మిలియన్లు పెద్ద గొప్ప విషయమేమీ కాదు.బాక్సాఫీస్ వద్ద మిలియన్లు సాధించి చూపించు’’ అంటూ మండిపడుతున్నారు.మొత్తానికి ఎప్పుడో వచ్చిన సినిమాను ఇప్పుడు ప్రమోట్ చేయడం ఏమిటో అంటూ మహేష్ ఫ్యాన్స్ కూడా కొందరు అనుకున్నారు.ఏదేమైనా ప్రమోషన్స్ విషయంలో మహేష్ తనదైన మార్క్ను వేసుకోవాలని మరోసారి ప్రయత్నించాడు.