నారా లోకేష్ గారు మరొకసారి ట్విట్టర్ లో ట్రోల్ల్స్ కి గురవుతున్నారు.ఆయన ట్వీట్ చేసిన వెంటనే తీవ్ర విమర్శలతో పాటు ఎన్టీఆర్కు వెన్నుపోటు అంశాన్ని లేవనెత్తుతూ సెటైర్లు వేస్తున్నారు.అసలు నారా లోకేష్ గారు ఏమని ట్వీట్ చేసారంటే.
“నవ్యాంధ్రలో మళ్ళీ చంద్రోదయమే అంటున్న అన్నగారు.ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆవిష్కృతమైనది ఈ కమనీయ దృశ్యం” అంటూ టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఫొటో పోస్ట్ చేశారు నారా లోకేష్.
అయితే ఈ ట్వీట్ పై కొందరు ఎలాంటి సెటైర్ లు వేశారంటే.
‘ఆ చంద్రుడే నాకు వెన్నుపోటు పొడిచాడు అని కూడా అన్నగారు చెప్పారని’ ఓ నెటిజన్ రీట్వీట్ చేయగా.‘చంద్రన్న సమయం 90 శాతం అయిపోయింది.
మరో 10 శాతం మాత్రమే మిగిలి ఉంది.తెలుగు ప్రజలకు మంచిరోజులు రాబోతున్నాయని అన్నగారు చెబుతున్నారు’ అని మరో వ్యక్తి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
‘చూడండి బ్రదర్.చంద్రాస్తమయం అని చూపిస్తున్నట్లుగా ఉంద’ని ఇంకొకరు కామెంట్ చేశారు.
‘మొన్న నే గా పౌర్ణమి వెళ్లిపోయింది., ఇంక వచ్చేది అమావస్యే !! అంటే అన్నగారు కూడా symbolic గా మీకు తిరోగమనం స్టార్ట్ అయింది అని మీకు చెబుతున్నట్టు వుంది.
అయ్యా పోస్ట్ పెట్టే ముందు చూస్కోవాలి కదా??!’, ‘మళ్లీ రావొద్దయ్యా, నీకో దండం’, *చూడండి బ్రదర్.ఇదిగో చంద్రాస్తమయం.
అని చూపిస్తున్నట్టు అనిపిస్తుందే మాకు’ అంటూ జోకులు పేలుస్తున్నారు.
.