కంగనా రనౌత్ పేరు వినగానే చాలామంది ఆమె కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అని భావిస్తారు.కొన్ని సందర్భాల్లో వివాదాలు ఆమెను చుట్టుముడితే మరికొన్ని సందర్భాల్లో కంగనానే కావాలని వివాదాలను సృష్టించుకుంటారు.
అయితే నిన్నటి నుంచి కంగనాను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.మణికర్ణిక సినిమాలోని అద్భుతమైన నటనకు కంగనా రనౌత్ ఉత్తమ నటిగా ఎంపికైన సంగతి తెలిసిందే.
గతంలోనే కంగనాకు ఉత్తమ నటిగా, ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డులు వచ్చాయి.తాజాగా మణికర్ణిక సినిమాకు వచ్చిన అవార్డుతో కంగానా ఖాతాలో మొత్తం నాలుగు అవార్డులు చేరాయి.
అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం వల్లే కంగానాకు అవార్డులు దక్కుతున్నాయని అర్హులు, ప్రతిభ ఉన్నవాళ్లకు అవార్డులు దక్కకుండా ఇతరులకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అయితే కంగనా నటన బాగుండటం వల్లే ఆమెకు అవార్డులు దక్కుతున్నాయని కంగనాకు అవార్డులు రావడం జీర్ణించుకోలేని కొంతమంది హీరోయిన్లు ఈ తరహా ప్రచారం చేస్తున్నారని కంగనా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.కేంద్రం ప్రకటించిన 67వ జాతీయ అవార్డుల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మోహన్ లాల్ సినిమా విడుదల కాకముందే అవార్డు ప్రకటించడం ఏమిటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సైరా నరసింహారెడ్డి మూవీ కంటే మహర్షి విధంగా ఏ గొప్ప అంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్న విమర్శలపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
జాతీయ అవార్డుల గురించి సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ జరుగుతోంది.కేంద్రం ప్రకటించిన అవార్డుల జాబితాలో కొంతమంది ఎంపిక బాగానే ఉన్నా మరి కొంతమంది ఎంపిక మాత్రం ఏ మాత్రం బాగాలేదని ప్రతిభ ఉన్నవారికి అవార్డులు దక్కలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.