టాలీవుడ్ లో స్వశక్తితో కష్టపడి జరిగినటువంటి హీరోల్లో మాస్ మహారాజ్ రవితేజ ఒకరు.అయితే తాజాగా రవితేజ క్రాక్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.
ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు.అయితే ఈ చిత్రాన్ని సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత మధు నిర్మిస్తున్నారు.
అయితే ఇప్పటికే శివరాత్రి పండుగ కానుకగా ఈ చిత్రానికి సంబంధించినటువంటి టీజర్ ను చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు.
అయితే ఈ చిత్ర టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
క్రాక్ చిత్ర టీజర్ విడుదలైన ఒక్కరోజులోనే దాదాపుగా 26 లక్షల పైచిలుకు వ్యూస్ తో దూసుకుపోతోంది.అయితే ఈ చిత్ర ట్రైలర్ యాక్షన్ ఓరియెంటెడ్ గా ఉన్నప్పటికీ చిత్రం మొత్తానికి ఒకే సీన్స్ హైలెట్ అయ్యింది.
ఇంతకీ ఆ సీన్ ఏంటంటే రవితేజ మీసాన్ని శృతిహాసన్ కాలితో మెలివేసే సన్నివేశాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.అంతేకాక ఈ సన్నివేశం బాగా కొత్తగా ఉండటం, గతంలో జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రవితేజ నటించిన టువంటి విక్రమార్కుడు చిత్రంలో కూడా రవితేజ ఇలానే మీసం మెలేసి సన్నివేశం బాగా హైలెట్ అయ్యింది.
దీంతో ఇప్పుడు క్రాక్ లో కూడా ఈ సన్నివేశం బాగానే ఆకట్టుకుంటోంది.
అయితే ఇది ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో రవితేజ నటించిన టువంటి అమర్ అక్బర్ ఆంటోనీ, నెల టికెట్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి.అయితే తాజాగా రవితేజ నటించిన టువంటి డిస్కో రాజా చిత్రం పర్వాలేదు అనిపించినప్పటికీ సరైన వసూళ్లను రాబట్టి లేకపోయింది.దీంతో ఈసారి రవితేజ కచ్చితంగా ట్రాక్ చిత్రంతో హిట్ కొట్టాలని పరితపిస్తున్నాడు.