తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజన్.ఐదో వారంలోకి అడుగు పెట్టింది.
ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుంచి సూర్య కిరణ్, కరాటే కళ్యాణి, దేవి నాగవల్లి బ్యాగ్ సద్దేయగా.నాల్గువ వారంలో స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయింది.
ఇక మరోవైపు కొత్త కొత్త టాస్కులు, గొడవలు, ఏడ్పులు, లవ్ ట్రాకులతో ఇంటి సభ్యులు బిగ్ బాస్ షోను రక్తి కట్టిస్తున్నారు.ఇదిలా ఉంటే.
ఇంటి సభ్యుల్లో కాస్త తేడాగా కనిపించే వారిలో జోర్దార్ సుజాత ముందు వరసలో ఉంటుంది. బిగ్ బాస్ స్టేజ్పైకి వచ్చీరాగానే నాగార్జునను బిట్టు అని పలకరిస్తూ జోర్దార్గా మాట్లాడిన సుజాత.
బిగ్ బాస్ హౌస్లో అతిగా నవ్వుతూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతోంది.పొరపాటున నీ నవ్వు భలే ఉంటుంది అని నాగార్జున అన్నందుకు.నవ్వడమే పనిగా పెట్టుకుంది సుజాత.అమె అసలు ఎందుకు నవ్వుతుందో ఇంటి సభ్యులతో పాటు చూసే ప్రేక్షకులకు కూడా అర్థంగాక.అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఆమె నవ్వే ఆమెకు మైనస్గా మారిందని చెప్పాలి.
వీకెండ్ వచ్చిందంటే చాలు.సుజాత నవ్వు చూడలేకపోతున్నాము అంటూ బిగ్ బాస్ ప్రియులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
నవ్వు రాకపోయినా కావాలనే నవ్వుతుందని.అది ఫేక్ నవ్వని.
నెటిజన్లు సోషల్ మీడియా వేధికగా ట్రోల్ చేస్తున్నారు.ఇక కెమెరా ముందుకు వచ్చి మరీ అతిగా నవ్వుతూ.
పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి.షో చూసే ప్రేక్షకులకు విసుగు తెప్పించింది.
అలాగే అవినాష్ అద్దం టాస్క్లో అందరిపై కామెడీ చేస్తే నవ్వింది.కానీ ఆమెపై పంచ్లు పేలిస్తే మాత్రం సీరియస్ అయ్యి.చివరకు అవినాస్తో సారి చెప్పించుకుంది.ఇక మరోవైపు నాగార్జునని పదే పదే బిట్టూ అంటూ పిలుస్తూ ఆయన ఫ్యాన్స్కు ఆగ్రహం కలిగిస్తోంది.
వయసులోనూ, అనుభవంలోనూ పెద్దవారైన నాగ్ను బిట్టూ అని పిలవడం కాస్త ఓవర్గా ఉందని.అలా పిలిచిన ప్రతి సారి చాలా చిరాగ్గా ఉందని నెట్టింట్లో ఏకిపారేస్తున్నారు.
ఈ క్రమంలోనే సుజాత నామినేషన్కు వస్తే.ఆమెను ఎలిమినేట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కామెంట్లు పెడుతున్నారు.
మొత్తానికి సుజాత ప్రవర్తన ప్రేక్షకులకు ఏ మాత్రం నచ్చడం లేదని స్పష్టం అవుతోంది.