ప్రస్తుతం భారత జట్టు క్రికెట్ ఆటగాళ్లు అందరూ కూడా సిరీస్ లలో భాగంగా విదేశాలలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. డబ్ల్యుటిసి ఫైనల్ మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ లో జరగబోయే టెస్ట్ సిరీస్ కు చాలా సమయం ఉన్నందుకు బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లకు కాస్త విరామం ఇచ్చింది.
దీంతో ఆటగాళ్లు లండన్ వీధుల్లో వారి కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా వారి సమయాన్ని గడిపేస్తున్నారు.ఇది ఇలా ఉండగా తాజాగా టీమిండియా స్టార్ పేసర్ ను క్రికెట్ ప్రేమికులు టార్గెట్ చేసి దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
సోషల్ మీడియా వేదికగా బుమ్రా తన భార్య సంజనతో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు.ఇక ఈ ఫోటోను చూసి జస్ప్రీత్ బుమ్రా ను క్రికెట్ ప్రేమికులు ట్రోల్ చేయడం మొదలు పెట్టేసారు.
ఇటీవల ఇంగ్లాండ్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి అందరికి విదితమే.ఈ మ్యాచ్ లో భాగంగా రెండు ఇన్నింగ్స్ ల్లో జస్ప్రీత్ బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేదు.
దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన క్రికెట్ ప్రేమికులు జస్ప్రీత్ బుమ్రా తన భార్యతో కలిసి ఉన్న ఫోటోపై ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు.అంతేకాకుండా కొద్ది రోజుల పాటు ఫోటోలు షేర్ చేయకుండా ఉండాలని భార్యతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో ఎందుకు షేర్ చేస్తున్నావు అంటూ క్రికెట్ ప్రేమికులు జస్ప్రీత్ బుమ్రా పై విరుచుకు పడ్డారు.
మరికొందరైతే ఏకంగా బూమ్రా భార్య సంజనను కూడా టార్గెట్ చేయడం విశేషం.ఈ క్రమంలో వివాహం అనంతరం ఫోటోలపై దృష్టి పెట్టావు.నీ ఆట పూర్తిగా తగ్గిపోయింది.నవ్వుతూ ఫోటోలు దిగడం కాదు ముందు వికెట్లు తియ్యి అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.