సెలెబ్రెటీలు అప్పుడప్పుడు చేసే కొన్ని పనులు ఒక్కసారిగా ప్రజలకు చిరాకు తెప్పిస్తాయి.సెలబ్రెటీలను కొన్ని లక్షల మంది ఫాలో అవుతారు.
వారు ఏది చెప్పినా చాలా తొందరగా ప్రజల్లోకి వెళ్తుంది.అందుకే సెలెబ్రెటీలను ఎక్కువగా పోలీసులు సైతం సామాజిక కార్యక్రమాలకు ఆహ్వానిస్తుంటారు.
కాని కొంత మంది మాత్రం చేసే చేష్టలు మాత్రం ఆగ్రహం తెప్పించే విధంగా ఉంటాయి.ఏ మాత్రం సామాజిక బాధ్యత లేకుండా ప్రవరిస్తున్న ఘటనలు మనం చూస్తున్నాం.
ఇక అసలు విషయంలోకి వెళ్తే ప్రస్తుతం తౌత్టే తుఫాను బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
అయితే నటి దియా ఔర్ బాతీ హమ్ సీరియల్ ఫేమ్ దీపికా సింగ్ చేసిన పనికి నెటిజన్లు భగ్గుమన్నారని చెప్పవచ్చు.
గెట్ వే ఆఫ్ ఇండియా దగ్గర అన్ని చెట్లు తుఫాను దెబ్బకు చెట్లు విరిగిపడ్డ విషయం తెలిసిందే.అయితీ తుఫానును మనం ఆపలేము, కాబట్టి ప్రకృతిలో ఎంజాయ్ చేయండి అంటూ విరిగిపడ్డ చెట్ల మధ్య ఫోటోలకు ఫోజులిచ్చింది దీపికా సింగ్.
అంతేకాక ఆ చెట్ల మధ్య డ్యాన్స్ చేసి ఆ వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు తుఫాను దెబ్బకు చాలా మంది నిరాశ్రయులయ్యారు.
అటువంటి వారి పరిస్తితి ఆలోచించకుండా జనాలు ప్రాణాలు కోల్పోతుంటే నీకు ఎలా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.