సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి ఒక వేదికగా మారింది.ఏ విషయమైనా పంచుకోవడానికి, తెలుసుకోవడానికి సోషల్ మీడియా ఖాతాలు బాగా ఉపయోగపడుతున్నాయి.
ఇక సెలబ్రెటీలకు మాత్రం సోషల్ మీడియా బాగా అలవాటు అయింది.తమ వ్యక్తిగత విషయాలను పంచుకోవడమే కాకుండా తమకు సంబంధించిన ప్రైవేట్, గ్లామర్ షో ఫోటోలను కూడా తెగ పంచుకుంటూ ఉంటారు.
కొన్ని కొన్ని సార్లు నెగిటివ్ కామెంట్లు, ట్రోల్స్ కూడా ఎదుర్కొంటున్నారు.ఇక తాజాగా ఓ హీరోయిన్ కూడా ప్రైవేట్ మూడ్ అంటూ ఓ ఫోటో షేర్ చేసింది.
అంతేకాకుండా ట్రోల్స్ కూడా తెగ ఎదురుకుంటుంది.ఇంతకీ ఆమె ఎవరో కాదు ప్రగ్యా జైస్వాల్.
తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి 2012 లో అడుగుపెట్టింది.మొదట హిందీ సినిమాతో పరిచయం కాగా ఆ తర్వాత డేగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.
ఆ తర్వాత మిర్చి లాంటి కుర్రాడు సినిమాలో నటించగా ఈ సినిమాలో కూడా అంతగా మెప్పించలేకపోయింది.ఇక కంచె సినిమాలో నటించి తన నటనకు మంచి గుర్తింపు అందుకుంది.
ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకోగా జయ జానకి నాయక, ఆచారి అమెరికా యాత్ర, సైరా లలో నటించింది.కానీ ఎందుకో అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోతుంది.
ఇక ఇటీవలే బాలయ్య నటించిన అఖండ సినిమాలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఈ సినిమాతో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది.బహుశా ఈ సినిమాతో అయినా ప్రగ్యా జైస్వాల్ లైఫ్ స్టార్ట్ అవుతుందేమో చూడాలి.ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది.విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
అందులో తనకు సంబంధించిన హాట్ ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.అప్పుడప్పుడు ఫోటో షూట్ లు చేయించుకుంటూ బాగా పంచుకుంటుంది.ఇక బాగా వర్కౌట్ కూడా చేస్తూ ఉంటుంది.
అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ హాట్ ఫోటో షేర్ చేసుకుంది.
అందులో తన అందాలతో కుర్రాళ్ళని పిచ్చెక్కిస్తుంది.హాట్ హాట్ లుక్ తో షార్ట్ డ్రెస్ లో బాగా ఫిదా చేస్తుంది.ఇక ఈ ఫోటోకు ఫ్రైడే మూడ్ అంటూ క్యాప్షన్ ఇచ్చుకుంది.ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారగా.ఈ ఫోటోకు తెగ కామెంట్లు వచ్చి పడుతున్నాయి.కొందరు ఈ ఫోటోను చూసి మైండ్ బ్లోయింగ్ అంటూ కామెంట్ పెట్టగా.
ఓ నెటిజన్ మాత్రం సిక్స్ ఫాక్స్ కి ట్రై చేస్తున్నారా మేడమ్ అంటూ ట్రోల్ చేశారు.మరి కొందరు హాట్ బ్యూటీ అంటూ.
అయినా కూడా టాలీవుడ్ లో ఎందుకు స్టార్ గా ఎదగలేక పోతున్నారు అని తెగ ప్రశ్నలు వేస్తున్నారు.