స్టార్ హీరోయిన్ సమంత పుష్ప ది రైజ్ లో ఐటమ్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.విడాకుల ప్రకటన తర్వాత సమంత ఐటమ్ సాంగ్ కు ఓకే చెప్పడంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
కొంతమంది సమంతను సపోర్ట్ చేస్తే మరి కొందరు ఆమెపై విమర్శలు చేశారు.అయితే పుష్ప సినిమా విడుదలైన తర్వాత ఐటమ్ సాంగ్ వల్ల సమంతకు ఒరిగిందేమిటి? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
రంగస్థలం సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడం వల్ల ఆ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన పూజా హెగ్డేకు ప్లస్ అయింది.అయితే పుష్ప సినిమాకు యావరేజ్ టాక్ రావడం వల్ల సమంతకు పుష్ప సినిమా ప్లస్ కాదనే చెప్పాలి.
ఈ సాంగ్ ద్వారా సమంత ఎలాంటి పాత్రలైనా చేస్తానని సంకేతాలు ఇవ్వడం మినహా ఆమె కెరీర్ కు ఒరిగిందేమీ లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.హద్దులు దాటి సమంత ఎక్స్ పోజింగ్ చేశారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
రొటీన్ ఐటం సాంగ్స్ మాదిరిగానే ఈ సాంగ్ కూడా ఉందని ఈ సాంగ్ లో ఏ ప్రత్యేకత లేదని ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.మరోవైపు ఇలాంటి సాంగ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల సమంత కెరీర్ పై ప్రభావం పడుతుందని సామ్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
మరోవైపు సమంత భవిష్యత్తు ప్రాజెక్టుల షూటింగ్ ఎప్పటినుంచి మొదలవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది.శాకుంతలం రిజల్ట్ పైనే సామ్ కెరీర్ ఆధారపడి ఉంది.
శాకుంతలం సామ్ కెరీర్ లోనే బెస్ట్ మూవీ అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.అయితే అంచనాలను మించిన బడ్జెట్ తో తెరకెక్కిన శాకుంతలం ఆ అంచనాలను మించి సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాల్సి ఉంది.సామ్ సినిమాలు, పాత్రల ఎంపిక విషయంలో జాగ్రత్త పడుతున్నారు.