తాజాగా ఒక వివాదం ద్వారా నిహారిక పేరు వార్తల్లో నిలిచిందనే సంగతి తెలిసిందే.వివాదాలకు దూరంగా ఉండే నిహారికను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తుండగా నాగబాబు వీడియో విడుదల చేసి నిహారిక తప్పు లేదని పోలీసులు చెప్పారని క్లారిటీ ఇచ్చారు.
అయితే నాగబాబు ఈ విషయంలో తొందర పడ్డారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.నాగబాబు వీడియో ద్వారా వివరణ ఇవ్వడంతో కొంతమంది ఆయనను కూడా ట్రోల్ చేస్తున్నారు.
నిజానికి ఈ కేసులో 150 మంది పేర్ల జాబితా వినిపించింది.అయితే వార్తల్లో మాత్రం రాహుల్ సిప్లిగంజ్, నిహారిక పేర్లు ముఖ్యంగా వినిపించాయి.వీళ్లు సెలబ్రిటీలు కావడంతో మీడియా వీళ్ల పేర్లను ఎక్కువగా ప్రచారంలోకి తెచ్చింది.అయితే రాహుల్ సిప్లిగంజ్ ఇప్పటికే తను ఏ తప్పు చేయలేదని ఎలాంటి పరీక్షలకైనా సిద్ధమని వెల్లడించారు.
గతంలో ఎవరూ మాదకద్రవ్యాలు తీసుకోకూడదని తాను అవగాహన కార్యక్రమాలను నిర్వహించానని రాహుల్ వెల్లడించారు.
నాగబాబు కూడా నిహారిక ద్వారా ఈ విధంగా క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సెలబ్రిటీల గురించి వస్తున్న కథనాలు వాళ్ల కుటుంబాలను సైతం తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.సెలబ్రిటీల పేర్లను బద్నాం చేయడం వల్ల వాళ్ల కెరీర్ పై కూడా ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి.గతంలో కూడా కొంతమంది సెలబ్రిటీలు ఈ తరహా కేసుల ద్వారా వార్తల్లో నిలిచారు.
అయితే తప్పు చేశారని నిర్ధారణకు వచ్చేవరకు సెలబ్రిటీలపై ఆరోపణలు చేయడం కూడా భావ్యం కాదు.ఈ వ్యవహారంలో మరి కొందరు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నప్పటికీ వాళ్ల పేర్లు మాత్రం బయటకు రాలేదు.నిహారిక గురించి పోలీసులతోనే నాగబాబు క్లారిటీ ఇప్పించి ఉంటే బాగుండేదని మరి కొందరు చెబుతున్నారు.
నిహారిక మీడియాతో మాట్లాడటానికి సుముఖంగా లేరని తెలుస్తోంది.