తీన్మార్ సావిత్రి.ఈ పేరు తెలియని తెలంగాణ ప్రజలే లేరు.
ఎందుకంటే తన మాటలతో తెలంగాణ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.
తొలిసారిగా వి6 న్యూస్ ఛానల్ లో తీన్మార్ వార్తల ద్వారా న్యూస్ యాంకర్ గా పరిచయమైంది.అందులో తను మాట్లాడే విధానం, చెప్పే విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
అంతే కాకుండా తనతో పాటు మరో యాంకర్ బిత్తిరి సత్తి కూడా అందరికీ తెలిసిందే.ఇక అతనితో తమ్ముడు అనుకుంటూ మాటలతో బాగా సందడి చేసేది.
పైగా అందులో సావిత్రి కట్టుబొట్టు కూడా బాగా ఉండేది.దాంతో తీన్మార్ వార్తలు రేటింగు లో కూడా మొదటి స్థానంలో ఉండేది.
అలా మనకు పరిచయమైన సావిత్రి అసలు పేరు శివ జ్యోతి.
ఈమె తెలంగాణ, నిజామాబాద్ జిల్లా, నాగంపేట గ్రామానికి చెందినది.ఈమెకు గంగూలి అనే వ్యక్తితో వివాహం కూడా జరిగింది.ఇక యాంకర్ గా మంచి గుర్తింపు పొందాలని కొన్ని ఛానల్స్ లో యాంకరింగ్ చేసింది.ఇక ఆమె కేరీర్ మొదట్లో తన భాష వల్ల, తన గొంతు వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.అదే సమయంలో v6 ఛానల్ వారు తెలంగాణ భాషలో మాట్లాడే వాళ్ళ గురించి ప్రకటించడంతో అందులో చదివి మంచి సెలబ్రిటీ హోదాను సంపాదించుకుంది.
ఇక అలా v6 లో తీన్మార్ సావిత్రిలా, బుగ్గల జాకెట్ ధరించు కున్న యాంకర్ గా పేరు సంపాదించుకుంది.ఆ తర్వాత సావిత్రికి బిగ్ బాస్ షో లో అవకాశం వచ్చింది.ఇక హౌస్ లో ఉన్నంత కాలం తన పరిచయాన్ని మరింత ఎక్కువగా పెంచుకుంది. సావిత్రక్క బాగా ఎమోషనల్ అని బిగ్ బాస్ షో ద్వారా తెలిసి పోయింది.
ఇక బిగ్ బాస్ తర్వాత సావిత్రి టీవీ9 లో ఇస్మార్ట్ న్యూస్ ఛానల్లో అడుగు పెట్టింది.
ఇక బిగ్ బాస్ లో తనతో పాల్గొన్న కంటెస్టెంట్ లతో ఇప్పుడు కూడా అదే ఫ్రెండ్ షిప్ ను కంటిన్యూ చేస్తుంది.
వారితో కలిసి బాగా పార్టీలలో తిరుగుతూ ఉంటుంది.పైగా సావిత్రక్క వేషధారణ పూర్తిగా మారిపోయింది.ఒకప్పుడు ట్రెడిషనల్ గా ఉన్న సావిత్రి బిగ్ బాస్ తర్వాత కాస్త గ్లామర్ ను పరిచయం చేస్తుంది.మోడ్రన్ గా తయారవుతూ అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది.
ముఖ్యంగా తనంటే ఎంతో అభిమానించే ప్రజలే ఆమె వస్త్రధారణ చూసి తట్టుకోలేకపోతున్నారు.తన ఇన్ స్టా లో ఎప్పటికప్పుడు ఫోటోలు బాగా పంచుకుంటుంది.తాజాగా కొన్ని ఫోటోలు పంచుకోగా అందులో వైట్ ప్యాంట్, రెడ్ చెక్స్ షర్టు వేసుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.ఇక ఈ ఫోటోలకు లైక్స్, కామెంట్ లు బాగా వస్తున్నాయి.
ఇక అందులో ఓ నెటిజన్ తన డ్రెస్సింగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
అందులో తన తండ్రి సావిత్రిని చూసి తన చెల్లెలు అనేవాడని.
కానీ ఇప్పుడు ఎవరో వార్తలు చదువుతున్నారని.అంతేకాకుండా తనను బాగా గుర్తుకు చేస్తున్నాడని అనడంతో వెంటనే ఆ నెటిజన్ తన తండ్రికి సావిత్రి ఫోటోలు చూపించటంతో.
పోరి ఏమో గిట్ల తయారయింది.గిసోంటి బట్టలేస్తుందని.
తీన్మార్ వార్తలు చదువుతున్నప్పుడు.ఎంత మంచిగుండు, ఎంత సక్కదనం ఉండు పోరి.
అని అన్నాడని ఆ నెటిజెన్ తెలిపారు.ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ గా మారింది.