బుల్లితెర యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా పలు సందర్భాల్లో వార్తల్లో నిలిచిన సంగతి విదితమే.అనసూయ పెట్టిన ఫోటోలు, పోస్టులను నెటిజన్లు ట్రోల్ చేయడంతో ఆ ట్రోల్స్ కు కౌంటర్లు ఇస్తూ అనసూయ ఇష్టానుసారం కామెంట్లు చేసే నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే తాజాగా అనసూయ చేసిన ఒక పనిని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.కష్టకాలంలో అనసూయ చేసిన పని తమకు ఎంతగానో మేలు చేసిందని చెబుతున్నారు. ఇటు టీవీ రంగంలో, అటు సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న అనసూయ అభినయానికి ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే ఎక్కువగా నటించారు.క్షణం సినిమాలో నెగిటివ్ రోల్ ను కనిపించి మెప్పించారు.
ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రంగ మార్తాండ సినిమాలో నటిస్తున్న అనసూయ గత మూడు రోజులుగా హైదరాబాద్ లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా ప్రజలకు అవసరమైన ఫోన్ నంబర్లకు సంబంధించిన సమాచారం తెలిసేలా చేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు పూర్తిగా ఇంటికే పరిమితం కావాలని.
ఇంట్లో సురక్షితంగా ఉండాలని పేర్కొన్నారు.ఇలాంటి కష్ట సమయాల్లో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
వంశీ కాక అనే ట్విట్టర్ ఖాతా నుంచి పోస్ట్ అయిన జీ.హెచ్.ఎం.సీ డిజాస్టర్ డిపార్టుమెంట్ ఎమర్జెన్సీ, జీ.హెచ్.ఎం.సీ, వాటర్ లాగింగ్ సెల్, ఎలక్ట్రిక్ కంట్రోల్, ఎన్డీఆర్ఎఫ్, ఇతర ఫోన్ నంబర్లు ఉన్న ట్వీట్ ను అనసూయ రీట్వీట్ చేశారు.
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల వల్ల చెరువులు పొంగిపొర్లడంతో పాటు కాలనీలు నీటమునిగాయి.
పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.వర్షాలు ఆగడంతో మరో రెండు రోజుల్లో పరిస్థితి కుదుటపడే అవకాశం ఉంది.
ఇలాంటి సమయంలో ప్రజలకు ఉపయోగపడే ఫోన్ నంబర్లకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలిసేలా చేసిన అనసూయపై ప్రశంసల వర్షం కురుస్తోంది.