దేశానికి ప్రధానిగా మోడీ వచ్చాక దేశప్రజల దశదిశ మారిపోతుందని అంతా భావించారు.కానీ యావత్ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లుతూ కేంద్రం చేస్తున్న పాలన మీద విమర్శలు వెల్లువెత్తుతున్న ఇంకా ఆయన దేశప్రజలకు ఏదో చేస్తారనే ఒక గుడ్డి నమ్మకంతో బ్రతుకులు వెళ్లదీస్తున్నారు.
ఇలాంటి నేపధ్యంలో కరోనా ప్రజలతో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడుతుంది.దీని ఫలితంగా దేశంలో ఓ వైపు కరోనా మహమ్మారి, మరో వైపు నిరుద్యోగ భూతం విలయతాండవం చేస్తున్న వేళ ప్రధాని నరేంద్రమోదీపై నెటిజన్లు మండిపడుతున్నారు.
కొవిడ్పై ప్రభుత్వ తీరును నిరసిస్తూ ట్విట్టర్ను హోరెత్తిస్తున్నారు.కాగా ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదంటూ, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో కరోనా మృత దేహాలను రహస్యంగా కాల్చి వేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ దాదాపు మూడు లక్షల ట్వీట్లు రావడం గమనార్హం.
అదీగాక దేశంలో తీవ్రంగా వ్యాపిస్తున్న కరోనాను అదుపు చేయడంలో మోదీ దారుణంగా విఫలమయ్యారని, కాబట్టి ఈ నిర్లక్ష్యానికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఇకపోతే ఇప్పటి వరకు సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ కలిగిన మోదీకి ట్విట్టర్లో ఈ స్థాయిలో నిరసన సెగ తగలడం ఇదే తొలిసారట.