ఉప్పెన సినిమాలో బేబమ్మ పాత్రలో మెప్పించిన బ్యూటీ కృతి శెట్టి.తొలి సినిమాతోనే తన నటనతో వరుస అవకాశాలను కూడా అందుకుంది.
ఒక్క చూపుతోనే, ఒక్క నవ్వుతోనే కుర్రాళ్ల మతి పోగొట్టిన ఈ బ్యూటీ.మొత్తానికి అభిమానుల హృదయాల్లో ఓ స్థానాన్ని నిలుపుకుంది.
అంతే కాదండోయ్ తన అందంతో స్టార్ హీరోల మనసులను కూడా దోచుకుంది.
ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో యంగ్ హీరో రామ్ నటించనున్న రాపో – 16 సినిమాల్లో నటిస్తుంది.
అంతేకాకుండా నాచురల్ స్టార్ హీరో నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాల్లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇవే కాకుండా సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఆ అమ్మాయి గురించి చెప్పాలని ఉంది అనే సినిమాలో కూడా నటిస్తుంది ఈ బ్యూటీ.
ప్రస్తుతం మూడు సినిమాలలో బిజీగా ఉన్నా కృతి శెట్టి మరి రెండు సినిమాలలో కూడా అవకాశాలను అందుకుందని తెలుస్తుంది.
హీరో నిఖిల్ నటించనున్న ఓ సినిమా, రానా సోదరుడు దగ్గుబాటి అభిరామ్ నటించనున్న సినిమాలో తనకు అవకాశాలు వచ్చాయని.
కానీ తాను చేయలేనని చెప్పిందని వార్తలు వినిపించగా.ఈ విషయం గురించి కృతి శెట్టి తన ట్విట్టర్ ద్వారా తెలిపింది.
ప్రస్తుతం తను ఈ సినిమాల గురించి వస్తున్న పుకార్లు విన్నానంటూ.ప్రస్తుతానికి మూడు సినిమాలలో సంతకం చేశానని తెలిపింది.ప్రస్తుతం తన ఏకాగ్రత మొత్తం తను ఓకే చేసిన సినిమాల పట్ల అని.తన తర్వాత సినిమాల పై సంతకం చేసినప్పుడు వాటి వివరాలు తెలుపుతానని తెలిపింది.
ఇక ఈ పోస్ట్ కు నెటిజనులు కృతి పై పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.మొదట పాఠశాల చదువులపై దృష్టి పెట్టమని కామెంట్స్ చేయగా.ప్రస్తుతం కోవిడ్ పరిస్థితిలో ఆటోమేటిక్ ప్రమోషన్స్ కారణంగా ఈజీగా పాస్ కావొచ్చని ఎగతాళి చేస్తున్నారు.మరి ఈ కామెంట్లను కృతి ఎలా చెక్ పెడుతుందో చూడాలి.