కమెడియన్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు ప్రియదర్శి. పెళ్లి చూపులు సినిమాతో కమెడియన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ యంగ్ టాలెంటెడ్ యాక్టర్ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు.
ప్రస్తుతం టాలీవుడ్ వెన్నెల కిషోర్ తర్వాత స్టార్ కమెడియన్ గా సక్సెస్ ఫుల్ కెరియర్ ని కొనసాగిస్తున్నాడు.తన తెలంగాణ మాండలికంతో ప్రియదర్శి చేసే సైలెంట్ కామెడీ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది.
దీంతో స్టార్ హీరోల సినిమాలలో కూడా అతనికి వరుసగా అవకాశాలు అందుతున్నాయి.అలాగే ఇండస్ట్రీలో అందరితో మంచి రిలేషన్ షిప్ కొనసాగించడంతో ఎక్కువగా ప్రియదర్శికి దర్శకులు అవకాశం ఇస్తున్నారు.
అలాగే కొత్త కొత్త దర్శకులు కూడా ప్రియదర్శి పాత్ర లేకుండా కథలు రాసుకోవడం లేదంటే అతిశయోక్తి కాదు.ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రియదర్శి లీడ్ రోల్ లో కంబాలపల్లి కథలు అనే సిరీస్ లో భాగంగా మెయిల్ అనే వెబ్ మూవీ తెరకెక్కింది.
ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.పల్లెటూరిలో కంప్యూటర్ వచ్చిన కొత్తలో, ఇంజనీరింగ్ గురించి ఎవరికీ కూడా పెద్దగా అవగాహనా లేని కాలంలో జరిగిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
ఒక డబ్బా కంప్యూటర్ కొనుక్కొని ఊరిలో కంప్యూటర్ గేమింగ్ సెంటర్ నడుపుకునే యువకుడిగా ప్రియదర్శి పాత్ర ఉంటుంది.అలాగే అతని దగ్గరకి కంప్యూటర్ నేర్చుకోవడానికి వచ్చే ఓ టీనేజ్ కుర్రాడి మధ్య నడిచే కామెడీ డ్రామాతో ఈ సినిమా తెరకెక్కింది.
ఇక ట్రైలర్ లోనే కంప్యూటర్ చుట్టూ కామెడీని జెనరేట్ చేసి ఆధ్యాంతం నవ్వులు పండించారు.ఉదయ్ గుర్రాల దర్శాకత్వంలో తెరకెక్కిన ఈ ట్రైలర్ చూసిన ఓ నెటిజన్ ప్రియదర్శిని ఉద్దేశించి ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు.
వైజాగ్ పోలీస్ స్టేషన్ మీ మీద కేసు వేస్తాం.నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవరు బాధ్యులు అంటూ కామెంట్ పెట్టాడు.దీనిపై ప్రియదర్శి కూడా ఆసక్తిగా స్పందించాడు.తమ్ముడు ఫస్ట్ లైవ్ చూసి ఒకేసారి హార్ట్ ఎటాక్ వచ్చినంత పైనంది.
సినిమా కోసం ఎదురుచూస్తున్నందుకు థ్యాంక్ అంటూ రిప్లై ఇచ్చాడు.సంక్రాంతి సందర్భంగా ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమా ఎంత మందిని ఆకట్టుకుంటుందో చూడాలి.