జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ సంస్థను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తున్న ఉద్యొగుల ధర్నాకి మద్దతు లిపిన విషయం అందరికీ తెలిసిందే.ఆ క్రమంలో అక్కడ ఉద్యోగులకి భరోసా ఇస్తూ తన పార్టీ తరుపున ప్రధానమంత్రికి లేఖని రాశారు.
అంతేనా ఒకడుగు వేసి లాభాలలో ఉన్న ఈ సంస్థని ప్రేవేటీ కరణ చేయడం అంత మంచిది కాదు నేను చూస్తూ ఊరుకోను అంటూ హెచ్చరిక కూడా చేశారు…ఈ విషయం అందరికీ తెలిసినదే అయితే అదే విషయం పై పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో పవన్ చేసిన ట్వీట్ చాలా మంది నాయకుల్లో కాక పుట్టించింది.
తాజాగా పవన్ చేసిన ట్వీట్ లో.పవన్ కళ్యాణ్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ సమస్యను మరోసారి ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ మెంబెర్స్ ను ఉదేశిస్తూ.దీనిపై ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ ఎంపీలంతా కలిసి ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నారు.
అయితే పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రం అయిన తమిళ నాడు నేలతకి మన నేతలకి ముడి పెట్టి మాట్లాడటం ఏపీ నేతలకి కూడా నచ్చలేదు.అంతేకాదు ఆ ట్వీట్ చుసిన సామాన్య ప్రజలకి కూడా ఈసడింపుగా అనిపించింది.
అయినా సరే ఏ ఒక్క ఏపీ ఎంపీ కూడా పవన్ వ్యాఖ్యలపై అంతగా స్పందించలేదు.తమిళ ప్రజల ప్రయోజనాల కోసం అక్కడి పార్లమెంటు సభ్యులు కృషి చేస్తుంటే.
ఏపీ ఎంపీలు మాత్రం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది అని తెలిపారు.
ఇవన్నీ పక్కన పెడితే.
ఇప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలకి…నెటిజన్లు మాత్రం దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తున్నారు.పవన్ కళ్యాణ్ కి నాయకత్వ లక్షణాలు లేవు అంటున్నారు.
ఒక పని ఎవరితో అయినా చేయించు కోవాలి అంటే అడిగే విధానం ఉంటుంది అని.పని చేసే వాళ్ళని పక్క వాళ్ళతో పోల్చి చుస్తే ఎలా ఉంటుందో మీకు తెలియక పోవచ్చు అంటూ ఘాటుగానే బదులు ఇచ్చారు.అంతేకాదు బిజెపి,టిడిపి రాష్ట్రాన్ని పట్టించుకోక పొతే ప్రశ్నిస్తా అని చెప్పిన పవన్ గావు కేకలు పెట్టి మరీ చెప్పిన పవన్ ఇప్పుడు ప్రశ్నించడం మానేశాడు.చిత్తశుద్ది అంటే ఇదేనా.
నీకే లేని చిట్టా శుద్ది ఎంపీ లకి ఎలా వస్తుంది అని అన్నారు.అంతేకాదు.
నిజంగా నీకే కనుకా చిత్తశుద్ది ఉంటే పవన్ కళ్యాణ్ స్వయంగా ఒక్కసారి డిల్లీ వెళ్లి మోడీ అప్పాయింట్మెంట్ సంపాదించి ఆయనతో మాట్లాడచ్చు కదా అంటున్నారు.నిన్ను నమ్మి ఒట్లేశాము మమ్మల్ని నట్టేట ముంచావు అంటూ నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.