టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం బాహుబలి. ఈ సినిమాతో హీరో ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది.
ఈ సినిమా విడుదల అయి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.అంతేకాకుండా ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు దక్కింది.
ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా కీలకపాత్రలో రూపొందిన ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలైన విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదల అయి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.
ఇక ఈ సినిమా విడుదల అయిన తరువాత ఇందులోని నటీనటుల నుంచి సాంకేతిక నిపుణుల వరకు ప్రతి ఒక్కరికి కూడా మంచి పేరు వచ్చింది.ఇకపోతే ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ బాహుబలి బిఫోర్ ది బిగినింగ్ పేరుతో ఒక సీరీస్ నిర్మిస్తున్న విషయం అందరికి తెలిసిందే.
అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా అధికారికంగా ప్రకటించారు.ఇలా ఉంటే భారీ బడ్జెట్ తో ఈ సిరీస్ ను తెరకెక్కించాలని భావించిన నెట్ ఫ్లిక్స్ ఈ ప్రాజెక్టులను పూర్తిగా పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు ఈ సిరీస్ కు సంబంధించి ఆరు నెలల పాటు షూటింగ్ చేశారు.ఇక ఆ చిత్రీకరణకు దాదాపు 150 కోట్ల వరకు ఖర్చు అయినట్లు తెలుస్తోంది.
కాకపోతే ఆ షూటింగ్ ఫైనల్ అవుట్ పుట్ పై నెట్ ఫ్లిక్స్ సంతృప్తి చెందలేదని వార్తలు వినిపిస్తున్నాయి.దీనితో ఈ సీరీస్ మొత్తాన్ని పక్కన పెట్టేసింది అని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అయితే ఈ విషయంపై అధికారికంగా స్పందించాల్సి ఉంది.
అంతకుముందే మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలో కొంత భాగాన్ని షూట్ చేసిన తర్వతా పలు కారణాలతో ఆమె ఈ సిరీస్నుంచి తప్పుకుంది.తర్వాత వామికా గబ్బిని ఈ ప్రధాన పాత్రలో అనేక సన్నివేశాలను రీషూట్ చేశారు.ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టినట్లు సమాచారం.అయితే ఈ ప్రాజెక్ట్ను పూర్తిగా పక్కన పెట్టారా ? తాత్కాలికంగానా ? అనేది తెలియాల్సి ఉంది.