దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్న కరోనా కేసుల విషయం లో పలు దేశాలు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా భారత్ నుండి వచ్చే విమాన సర్వీసులను గానీ, ప్రయాణికులను గానీ నిషేధించాయి.
అదీగాక కఠినమైన ఆంక్షలు విధించాయి.
ఈ క్రమంలో మన పొరుగు దేశం అయిన నేపాల్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది.
నేటి అర్ధరాత్రి నుంచి ఈ నెల 14 వ తేదీ వరకు అన్ని దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.కానీ చార్టెర్డ్ విమానాలను మాత్రం అనుమతి ఇస్తున్నట్లుగా ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి హృదయేష్ త్రిపాఠి తెలియచేశారు.
కాగా దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులకు అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఇక్కడి అధికారులు పేర్కొంటున్నారు.అంతే కాకుండా ఈ దేశం లో అడుగు పెట్టే వారికి కరోనా నెగటివ్ సర్టిఫికెట్ తప్పని సరిగ్గా ఉండాలని స్పష్టం చేశారు.