పారితోషికం మ్యాటర్‌ కాదంటున్న ముద్దుగుమ్మ

తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుని, అక్కడ వరుస విజయాలు వచ్చిన సమయంలో తెలుగులో ‘నేను శైలజ’ చిత్రంలో నటించింది కీర్తి సురేష్‌.ఈ అమ్మడు తెలుగులో ఎంట్రీ ఇచ్చిన చిత్రం సక్సెస్‌ అయినా కూడా ఇప్పటి వరకు ఈమె రెండవ సినిమాకు ఓకే చెప్పింది లేదు.

 Keerthy Suresh Denies Rumours About Remuneration-TeluguStop.com

ఇప్పటికే ఈమె వద్దకు పలువురు దర్శకులు మరియు నిర్మాతలు అవకాశం ఇచ్చేందుకు వెళ్లినా కూడా ఏవో కారణాలు చెబుతూ నో చెప్పినట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం తమిళంలో నటిస్తున్న ఈ అమ్మడు త్వరలోనే మంచి సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తాను అంటోంది.

తాజాగా ఈ అమ్మడు పారితోషికం విషయంలో స్పందించింది.గతంలో తాను భారీగా పారితోషికాన్ని పెంచినట్లుగా మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు అని చెప్పిన ఈ ముద్దుగుమ్మ తాజాగా మరోసారి తనకు పారితోషికం ముఖ్యం కాదు అని తేల్చి చెప్పింది.

తన వద్దకు ఎన్నో ఆఫర్లు వస్తాయని, అయితే కథ నచ్చితేనే నేను ఆ సినిమాలో నటిస్తాను అని, కథ మరియు అందులో నా పాత్ర నచ్చితే పారితోషికం విషయంలో పట్టు విడుపులతో వ్యవహరిస్తాను అని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.గ్లామర్‌ పాత్రలకు తాను దూరం అని, హీరోయిన్‌గా ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో అయితేనే నేను నటిస్తాను అంటూ ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube