కరోనా వైరస్.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్ ప్రజల జీవితాలను అతలాకుతలం చేసేసింది.
ఇంకా నేపథ్యంలోనే తమిళనాడుకు చెందిన 103 ఏళ్ల వృద్ధురాలు కరోనా వైరస్ భారిన పడిన పడింది.దీంతో ఆసుపత్రిలో చికిత్స పొంది కరోనా నుండి పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వచ్చింది.
103 ఏళ్ల వయసులో కరోనాను జయించిన వృద్ధురాలిని చూసి వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు.అనంతరం ఆమె ఇంటికి చేరుకుంది.
ఇంకా ఇరుగుపొరుగు వారు అంత కరోనా ఉంటుంది అని బెదిరిపోతున్నారు.ఆమె వెంటనే ఇల్లు ఖాళీ చెయ్యాలి అని ఇరుగుపొరుగు వారి నుంచి ఒత్తిడి పెరిగింది.
అయితే గత 15 ఏళ్ళ నుండి ఆమె కుమార్తె, ఆమె మనవరాలు ఆ అద్దె ఇంట్లో ఉన్నట్టు.ఇరుగుపొరుగు వారితో కలిసిమెలిసి ఉండేవారు అని ఇప్పుడు ఈ కరోనా కారణంగా అందరికి దూరం అయినట్టు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
అంతేకాదు వారు ఈ కుటుంబం నుంచి ఎవరైనా స్థానికంగా ఉన్న దుకాణాలకెళితే.వీరికి ఏవీ అమ్మడం లేదు ఏవి అడిగినా లేవు పొమ్మంటున్నారు.ఇంకా ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ఈ కుటుంబానికి నిత్యావసరాలను ఇచ్చి రూ.5వేలు ఆర్థిక సాయం చేశారు.