మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తెలుగు ఇండస్ట్రీలో మెగా వారసుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు.టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో చరణ్ను ఫుల్ మాస్ యాంగిల్లో చూపించడంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.
ఇక ఈ సినిమాతో చరణ్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు.ఈ సినిమాలో చరణ్ యాక్టింగ్కు జనాలు ఫిదా అయ్యారు.
కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నేహా శర్మ అందాల ఆరబోతకు అప్పట్లోనే ప్రేక్షకులు ఫుల్ ఖుషీ చేసుకున్నారు.
చరణ్తో కలిసి ఆమె చేసిన రొమాన్స్ ఓ రేంజ్లో ఉండటంతో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది.
ఇక ఈ సినిమాతో టాలీవుడ్లో మంచి ఆఫర్లు వస్తాయని అనుకున్న నేహా శర్మ, ఆ తరువాత కుర్రాడు అనే సినిమాలో నటించింది.ఆ తరువాత వరుసగా బాలీవుడ్లో ఆఫర్లు వచ్చి పడటంతో ఇక్కడ బిచాణా ఎత్తేసింది.
అటుపై కేవలం బాలీవుడ్లోనే ఆఫర్లు సాధిస్తూ దూసుకుపోయిన ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో కుర్రకారుకు పిచ్చెక్కించింది.
నేహా శర్మ సినిమాలకంటే కూడా ఆమె అందాల ఆరబోతకే అభిమానులు ఎక్కువున్నారంటే అతిశయోక్తి కాదు.
మరి అంతలా అందాల ఆరబోతతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు మళ్లీ టాలీవుడ్లో నటించాలని కోరుకుంటోంది.తనకు పేరు తెచ్చిన చిరుత సినిమా సీక్వెల్లో నటించాలని ఉందని ఆమె చెప్పుకొచ్చింది.
మరి పూరీ జగన్నాథ్ చిరుత చిత్రానికి సీక్వెల్ను తెరకెక్కిస్తాడా, కనీసం ప్లాన్ చేస్తాడా అనేది సందేహమే అని చెప్పాలి.