ఉమైర్ సంధూ… ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ గా తనకు తాను చెప్పుకుంటూ ప్రతి సినిమా విడుదలకు మూడు రోజుల ముందుగానే ట్విట్టర్ లో తన వంతుగా రివ్యూ ఇచ్చే ఒకానొక ట్విట్టర్ రాయుడు.తనకు నచ్చిన రీతిలో ప్రతి సినిమాకి రివ్యూ చేస్తూ ఉంటాడు.
ఇతను నిజానికి సెన్సార్ బోర్డు మెంబర్ అవునా కాదా అనే విషయం క్లారిటీ లేదు కానీ ప్రతి సినిమాకి రివ్యూ ఇవ్వడం మాత్రం ఆనవాయితీగా మార్చుకున్నాడు.ఇక ఉమైర్ సంధూ ట్వీటగానే మన మీడియా అతడి ట్వీట్ ని కళ్ళకు అద్దుకొని మరి అదొక ఆ సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ లాగానే భావించి మొదటి రివ్యూ అంటూ వెబ్ సైట్ లో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉమైర్ సంధూ కి ఎక్కడ లేని పాపులారిటీ తీసుకొస్తూ ఉంటారు.
తను ఇచ్చి రివ్యూ లో 90% ఆహా ఓహో అంటూ ఓ సినిమాని పొగడటం మాత్రమే ఉంటుంది.తీరా సదరు సినిమా విడుదల అయింది అంటే అతను చెప్పే దానికి, సినిమాలో ఉన్న దానికి సంబంధం ఉండదు.
బాహుబలి, మగధీర, ఆర్ఆర్ఆర్ వంటి అన్ని సినిమాలకు ఇచ్చిన రివ్యూ ఒక శాపంగా మారింది.ఇక రాధే శ్యామ్ సినిమా అయితే బంపర్ సూపర్ హిట్ అంటూ చెప్పాడు.
ఇక విడుదలైన తర్వాత అదొక డిజాస్టర్ అయింది.ఇలా అనేక డిజాస్టర్ సినిమాలకు సూపర్ హిట్ అంటూ రివ్యూ ఇవ్వడం అతడికి అలవాటే.
ఇక తాజాగా పోనియన్ సెల్వన్ సినిమాకి అదిరిపోయే రివ్యూ ఇచ్చాడు.కానీ మొహం మీద చాచి కొట్టినట్టు సుహాసిని ఇచ్చిన రిప్లై తో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక చర్చ సాగుతోంది.
ఇతడు ఎవరు ? సినిమా చూడకుండా రివ్యూ ఎలా ఇస్తున్నావ్ అంటూ సుహాసిని ఉమైర్ సంధూ ని ప్రశ్నించింది.దాంతో నేటిజన్స్ రెండు భాగాలుగా విడిపోయి సుహాసిని కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటే మరికొంతమంది సినిమాని సినిమాగా చూడాలంటూ సుహాసినికే చురకలు ఇస్తున్నారు.ఈ సంగతి పక్కన పెడితే అనేక సినిమాలకు ఉమర్ సందు ఇచ్చే రివ్యూలు అట్టర్ ఫ్లాప్ అని తెలిసినా కూడా అతని రివ్యూలనే మన మీడియా నెత్తికి ఎక్కించుకుంటుంది.మరి ఇలాంటి సోషల్ మీడియా రివ్యూస్ మాటలు వింటూ సినిమాకి రివ్యూస్ ఇచ్చే వారిని ఆపేవాడు ఎవరూ లేరు కాబట్టి ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉంటారు సోషల్ మీడియా జర్నలిస్టులు.