సూపర్ స్టార్ కృష్ణ మరణించారనే వార్తను ఆయన అభిమానులు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు.ఎంతో మంచి మనిషి అయిన కృష్ణ దూరమయ్యాడనే వార్త నిజం కాకపోతే బాగుండేదని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నిన్న మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరిగాయి.కృష్ణ అంత్యక్రియలు అక్కడ కాకుండా సొంత స్థలంలో జరిపి ఉంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్ లోని చాలా ఏరియాలలో కృష్ణ కుటుంబ సభ్యులకు స్థలాలు ఉన్నాయి.గతంలో పలువురు సినీ ప్రముఖులు మరణించిన సమయంలో సొంత స్థలాల్లోనే అంత్యక్రియలు జరిపి సమాధి నిర్మించడం జరిగింది.
సొంత స్థలంలో కృష్ణ అంత్యక్రియలు జరిపి స్మారక మందిరం నిర్మించి ఉంటే బాగుండేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మహేష్ ఈ విధంగా ఆలోచించి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణ తన సినీ కెరీర్ లో 360కు పైగా సినిమాలలో నటించి సక్సెస్ లను అందుకున్నారు.కృష్ణ కుటుంబ సభ్యులకు వరుసగా కష్టాలు వస్తుండటం ఫ్యాన్స్ కు సైతం బాధ కలిగిస్తోంది.
ఏడాది కాలంలో తల్లి, తండ్రి, సోదరుడిని కోల్పోయిన మహేష్ బాబుకు వచ్చిన కష్టాలు మరెవరికీ రాకూడదని మహేష్ అభిమానులు కోరుకుంటున్నారు.ఈ బాధలను తట్టుకునే శక్తిని దేవుడు మహేష్ కు ప్రసాదించాలంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మహేష్ బాబు వర్క్ తో బిజీ కావాలని కొంతమంది సూచనలు చేస్తుండటం గమనార్హం.వరుస విషాదాలను తట్టుకోవడం సులువు కాదని పనిలో పడితే మాత్రమే ఈ విషాదాలను తట్టుకోవడం సాధ్యమవుతుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో రెండు సినిమాలలో నటించిన మహేష్ ప్రస్తుతం మరోసారి నటిస్తున్నారు.ఈ సినిమా పూర్తైన తర్వాత మహేష్ జక్కన్న సినిమాలో నటించనున్నారు.