మనుషులు ఎప్పుడైనా మారిపోతారని అంటున్న యంగ్ బ్యూటీ... అందుకే...

తెలుగులో నూతన దర్శకుడు మున్నా దర్శకత్వం వహిస్తున్న “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం కాబోతున్న మలయాళ బ్యూటీ “అమృత అయ్యర్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ చిత్రంలోని  “నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా” అనే పాట యూ ట్యూబ్ లో సంచలనం సృష్టించింది.

 Neeli Neeli Akasam Song Fame Amrutha Ayyar Shares Emotional Post In Instagram, A-TeluguStop.com

కాగా ఈ పాటను యూట్యూబ్ లో దాదాపు గా 100 మిలియన్ల పై చిలుకు మంది వీక్షించారు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు పూర్తయినప్పటికీ ప్రస్తుతం సినిమా థియేటర్లు మూత పడటంతో కొంతకాలం పాటు తాత్కాలికంగా వాయిదా వేశారు.

 ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ లేకపోవడంతో కొంతకాలంగా అమృత అయ్యర్ ఇంటి పట్టునే ఖాళీగా గడుపుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మాత్రం బాగానే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు అందుబాటులో ఉంటుంది.

 అయితే తాజాగా అమృత అయ్యర్తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ ఫోటోని షేర్ చేస్తూ ఎక్కువగా మానవ సంబంధాలకి బానిసలు కాకూడదని మనుషులు ఏ క్షణంలోనైనా మారిపోతారని అంటూ క్యాప్షన్ పెట్టింది.దీంతో అమృతా అయ్యర్ షేర్ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తెలుగులో అమృత అయ్యర్ కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న “రెడ్” అనే చిత్రంలో మూడవ హీరోయిన్ గా నటిస్తోంది.కాగా ఈ చిత్రంలో టాలీవుడ్ ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్నాడు.

 ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు పూర్తి కావడంతో సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube