మారుతున్న సమాజంలో స్త్రీ, పురుష సబందాల కంటే, ఒకే లింగ సంబధాలు కూడా భాగా పెరిగిపోతున్నాయి.ఇండియాలో కంటే విదేశాలలో స్వలింగ సపర్క రిలేషన్స్ ఎక్కువగా దర్శనం ఇస్తూ ఉంటాయి.
ప్రజలు కూడా స్వేచ్చగా బయటకి వచ్చి తాము స్వలింగ సంపర్కులం అనే విషయాలని చెప్పుకుంటూ ఉంటారు.అయితే ఇలాంటి రిలేషన్స్ లో సంతానం అనేది వారికి పెద్ద సమస్యగా మారుతుంది.
స్వలింగ సంపర్క భార్య, భర్తలు కూడా తమకి పిల్లలు కావాలని కోరుకుంటూ ఉంటారు.
ఇప్పుడు అలాంటి సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది.తన కొడుకు స్వలింగ సంపర్క రిలేషన్ లో ఉండి, వేరొక మగాడిని పెళ్లి చేసుకున్నాడు.వాళ్ళిద్దరూ పిల్లలు కావాలని కోరుకున్నారు.
అయితే కొడుకు కోరికని అరవై ఏళ్ల తల్లి తీర్చడానికి ముందుకొచ్చింది.ఇప్పుడు ఈ ఘటన సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.
నెబ్రస్కాలో నివాసం ఉంటున్న 61 ఏళ్ల సెసిల్ ఎలెగ్కు ఒకే ఒక్క కొడుకు మ్యాథ్యూ.మ్యాథ్యూ స్వలింగ సంపర్కుడు కావడంతో ఇలియట్ డౌగెర్టీ అనే మరో యువకుడిని పెళ్లిచేసుకున్నాడు.పెళ్లైన తర్వాత సంతానం కావాలనే కోరిక వారికి కలిగింది.
అయితే పురుషుల గర్భం దాల్చే అవకాశం ఉండదు కాబట్టి తన కోరికను తల్లి సెసిల్ ఎలెగ్కు కొడుకు మ్యాథ్యూ చెప్పాడు.కొడుకు కోరిక విని, సరోగసి విధానం ద్వారా వారి బిడ్డకు జన్మనిచ్చేందుకు అతని తల్లి ముందుకొచ్చింది.
సరోగసి విధానంలో బిడ్డను తొమ్మిదినెలల పాటు మోసింది ఆసుపత్రిలో ఆడపిల్లకి జన్మనిచ్చిన సెసిల్ ఇప్పుడు సరోగసి విధానం ద్వారా తన మనవరాలికి జన్మనిచ్చిన మొదటి తల్లిగా రికార్డు క్రియేట్ చేసింది
.