ఏపీ లో స్వైరవిహారం చేస్తున్న కరోనా రక్కసి!

ఏపీ లో కరోనా రక్కసి స్వైరవిహారం చేస్తుంది.రోజు కు అక్కడ ఏకంగా 8 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తుంది.

 Ap Register With Nearly 8,000 Covid-19 Cases, Ap, Covid Cases,lockdown, Corona C-TeluguStop.com

ఒకపక్క రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతుండడం తో అధికారులు ఆందోళన చెందుతున్న ఈ సమయంలో తమకు సరైన పీపీఈ కిట్లు తగిన సదుపాయాలు లేవంటూ కొన్ని చోట్ల వైద్య సిబ్బంది ఆందోళన చేపడుతున్నారు.ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవంటూ వారు ఆరోపిస్తున్నారు.

తాజాగా ఏపీ లోని తెనాలిలో వైద్య సిబ్బంది కూడా ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవని ప్రాణాల మీదకు వచ్చినా విధులకు హాజరుకావాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కనీస సదుపాయాలు లేకుండా వైద్యం అందించడం చాలా కష్టంగా ఉందంటూ వారు వాపోతున్నారు.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 72 వేలకు పైగా నమోదు కాగా, 884 మంది మృత్యువాత పడ్డారు.దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే.

రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి.రాష్ట్రాల వ్యాప్తంగా కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదు అవుతున్నాయి.

మహారాష్ట్ర, ఢిల్లీ,తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదు అవుతుండగా యూపీ లో కూడా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ కేసులు మాత్రం నియంత్రించలేకపోతున్నారు.

రోజు రోజుకు ఈ కరోనా మహమ్మారి కేసులు పెరిగిపోతుండటం తో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి.

ఈ మహమ్మారి ని నియంత్రించడానికి కొన్ని రాష్ట్రాలు మరోసారి లాక్ డౌన్ విధించినప్పటికీ కూడా కేసుల విషయంలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు.

ఈ మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చే వరకు మాత్రం ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిందే అంటూ పీఎం మోడీ సైతం సూచనలు చేసిన విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube