తివారీ కొడుకు హత్య చేసారని నిర్ధారించిన పోలీసులు! షాకింగ్ నిజాలు వెల్లడి

ఎన్ డి తివారి డి ఎన్ ఎ కొడుకు రోహిత్ శేఖర్ తాజాగా చనిపోయిన సంగతి అందరికి తెలుసిందే.ఇతని మరణం ఇప్పుడు అక్కడ సంచలనంగా మారగా.

 Nd Tiwari Son Death Mystery Become A Murder-TeluguStop.com

దీనిపై పోలీసులు విచారణ మొదలెట్టారు.ఇదిలా ఉంటే తాజాగా రోహిత్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆసక్తికర నిజాలని పోలీసులు బయట పెట్టారు.

రోహిత్‌ శేఖర్‌ది సాధారణ మరణం కాదని, ఎవరో దిండుతో అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలిపారు.మృతదేహానికి పోస్టుమార్టం రోహిత్‌ ఊపిరాడక, గుండె ఆగి చనిపోయినట్లు వెల్లడైందన్నారు.

హత్య కేసుగా నమోదు చేసి విచారణను నేర విభాగానికి బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు.తాజాగా నేర విభాగం రోహిత్ కుటుంబ సభ్యులని విచారించినట్లు తెలుస్తుంది.అలాగే ఈ కేసులో అన్ని కోణాలలో విచారించి అతని మృతి వెనుక మిస్టరీని చీదిస్తామని క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.ఎన్ డి తివారి చనిపోయిన కొద్ది నెలల్లోనే రోహిత్ హత్య కావడం వెనుక ఎన్ డి తివారి కుటుంబ సభ్యుల ప్రమేయం ఏమైనా ఉందా.

లేక వేరే ఎవరైనా అతనిని హత్య చేసారా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube