బాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.సుశాంత్ ఆత్మహత్యపై విచారణ చేస్తే బాలీవుడ్ డ్రగ్స్ లింకులు బయటకి వచ్చాయి.
దీంతో నారోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈ డ్రగ్స్ వ్యవహారంపై ప్రత్యేక ద్రుష్టి పెట్టింది.డ్రగ్స్ సంప్లయర్స్ తో డైరెక్ట్ సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె తమ్ముడుని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
అయితే ఈ కేసులో రియా చక్రవర్తి పలువురు పేర్లు బయటపెట్టినట్లు ఆ మధ్య మీడియాలో ఎక్కువగా వినిపించింది.అయితే అలాంటిదేం లేదని అప్పట్లో ఎన్సీబీ అధికారులు ఆ వార్తలని ఖండించారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి నలుగురు హీరోయిన్స్ పేర్లు తెరపైకి వచ్చాయి.వారిలో రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే పేరు కూడా బయటకి రావడం సంచలనంగా మారింది.రియా చక్రవర్తి ఇచ్చిన వాంగ్మూలం మేరకు పలువురు సినీ తారలకు నోటీసులు ఇచ్చేందుకు ఎన్సీబీ అధికారులు సన్నద్ధం అవుతున్నారు.దీపికా పదుకునే, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ లతో పాటు డిజైనర్ సిమోన్, దీపిక మేనేజింగ్ ఏజన్సీ ప్రతినిధి కరిష్మా తదితరులకి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.
ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్ హోత్రా, వీరికి ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 67 కింద సమన్లు పంపి, విచారించనున్నామని తెలియజేశారు.ఈ కేసు విచారణలో భాగంగా ఓ నిందితుడిని విచారిస్తున్న సమయంలో అతని చాటింగ్ గ్రూప్ లో డీకే అన్న అక్షరాలు కనిపించడం, డీ అంటే దీపిక అని, కే అంటే క్వాన్ టాలెంట్ మేనేజ్ మెంట్ ఏజన్సీ ప్రతినిధి కరిష్మా అని అధికారులు గుర్తించినట్టు సమాచారం.
దీపికా పేరు ఈ డ్రగ్స్ కేసులో బయటకి రావడంతో ఇదే అవకాశంగా భావించి కంగనా ఆమెపై నోరు పారేసుకుంది.డ్రగ్స్ ఉపయోగించడం వలనే ఆమె డిప్రెషన్ కి గురై ఉంటుందని కామెంట్స్ చేసింది.
ఈ డ్రగ్స్ నోటీసులపై దీపికా ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు వేచి చూడాలి.