విలక్షణ నటుడు నాజర్.సౌత్ ఇండస్ట్రీ లోని అన్ని భాషల్లో కూడా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు.
కమెడియన్ దగ్గర నుంచి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర వరకు అన్నిటిలో ఒదిగిపోయి నటించి ప్రేక్షకులను మెప్పించారు.సౌత్ ఇండస్ట్రీ లో ఉన్న మంచి నటులలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు.
అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాజర్ మెగాస్టార్ చిరంజీవి గురించి పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు.చిరంజీవి నేను అప్పట్లో ఒక యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకున్నామూ అంటూ చెప్పారు నాజర్.
ఆ తర్వాత చిరంజీవి పెద్ద నటుడిగా ఎదిగితే తాను మాత్రం హోటల్లో పని చేశాను అంటూ గుర్తు చేసుకున్నాడు.ఇలా పని చేస్తే ఎప్పుడు డబ్బులు వస్తూ ఉంటాయి.
కానీ ఈ సినిమా ఎప్పుడో ఒకసారి వస్తుంది అందుకే సినిమాల్లోకి వెళ్లాలని అనుకోలేదు.తాజ్ కోరమండల్ హోటల్ లో పనిచేస్తున్న సమయంలో ఓ రోజు కొంతమంది చాలా గుంపుగా ఉన్నారు.
ఏం జరిగిందా అని అక్కడికి వెళ్లి చూస్తే చిరంజీవి సినిమా షూటింగ్ జరుగుతోంది.చిరంజీవి కంటపడకుండా అక్కడినుంచి వెళ్ళిపోదామనుకున్నాను.
అంతలోనే చిరంజీవి నన్ను పలకరించారు.ఏం చేస్తున్నావ్ ఎలా ఉన్నావ్ అంటూ బాగోగులు అడిగారు.
హోటల్లో పనిచేస్తున్నాను చెప్పగానే చిరంజీవి షాక్ అయ్యారు.ఒక గొప్ప నటుడివీ ఇలా హోటల్లో పని చేయడం ఏంటి ఒకసారి నన్ను కలువు అంటూ చెప్పారు.ఆ తర్వాత నేను చిరంజీవి గారిని కలవ లేదు.కానీ ఇక బాలచందర్ గారి సినిమాలో అవకాశం వచ్చింది.ఆ తర్వాత సినిమాల్లో కొనసాగుతూ వచ్చాను అంటూ చెప్పుకొచ్చారు.అయితే యాక్టింగ్ స్కూల్ కి వెళ్ళిన సమయంలో అందరూ ఆంధ్ర మెస్ లో భోజనం చేసేవారూ.
ఆ సమయంలో తాను క్యారేజ్ తీసుకు వెళ్లాను.దీంతో ఇది చూసిన చిరంజీవి రేపటి నుంచి నువ్వు కూడా మాతో పాటే తినాలి లేదంటే చంపేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు నాజర్.