టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన తార ప్రస్తుతం కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది.
ప్రస్తుతం దక్షిణాదిలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ లలో ఒకరిగాపేరు సంపాదించుకుంది నయనతార.ఈమెకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన విఘ్నేశ్ శివన్తో గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ జంట నిశ్చితార్థం కూడా చేసుకున్న ఈ జంట ఎప్పుడెప్పుడు ఒక్కటి అవుతుందా అని కోలీవుడ్ సినీ ప్రేక్షకులతో పాటు ఇతర ఇండస్ట్రీలో ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.అయితే ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఆ సమయం రానే వచ్చేసింది.
విఘ్నేశ్, నయనతార రేపు నెల అనగా జూన్ 9న తిరుమలలో వివాహబంధంతో ఒకటి కాబోతున్నారు.ఈ క్రమంలోనే పెళ్లికి ముందు గుళ్ళూ గోపురాలు సందర్శిస్తూ ఉన్నారు.తాజాగా తిరుపతిలో ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఈ జంట ఆ తరువాత తిరుచ్చిలోని శ్రీరంగం వెళ్లి శ్రీరంగనాథుని దర్శించుకున్నారు.
ఆ తరువాత తంజావూరు జిల్లా అయ్యం పేట సమీపంలోని పళత్తూర్ గ్రామానికి వెళ్లి విఘ్నేశ్ కులదైవం అయిన కంచి కామాక్షి అమ్మవారిని దర్శించి అక్కడ విశేష పూజలు నిర్వహించారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే పెళ్లి తర్వాత గుళ్ళూ గోపురాలు సందర్శించాల్సిన ఈ జంట పెళ్లికి ముందే ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా బిజీ బిజీ అయిపోయారు.
మరొకవైపు వీరి పెళ్లికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
తాజా వార్తలు