దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా కరోనా వాక్సిన్ వేయించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార తన ప్రియుడు విగ్నేష్ శివన్తో కలిసి వాక్సిన్ కేంద్రానికి వెళ్లి కరోనా టీకా తీసుకుంది.ఆమె వెంట వెళ్లిన విగ్నేష్ శివన్ కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సినిమాలతో పాటు లవ్ ట్రాక్స్తో ఫేమస్ అయిన తారల్లో నయన్దే తొలి స్థానం.
సోషల్ మీడియాలో నయన్ ప్రేమ, పెళ్లి మ్యాటర్ ఎప్పుడూ హాట్ టాపికే.మొదట్లో శింబు, ఆ తర్వాత ప్రభు దేవాతో చెట్టాపట్టాలేసుకు తిరిగిన నయన్.
వాళ్ళిద్దరితో బ్రేకప్ అయ్యాక దర్శకుడు విగ్నేష్ శివన్తో ప్రేమాయణం నడుపుతోంది.గత కొన్నేళ్లుగా ఎంజాయ్ చేస్తున్న ఈ ప్రేమ పక్షులు ఎక్కడికి వెళ్లినా జంటగా వెళుతుండటంతో నిత్యం వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు.
ఇప్పటికే జంటగా దేశాలు చుట్టివచ్చిన ఈ జోడీ.రీసెంట్గా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.టీకా కేంద్రానికి జంటగా వెళ్లి ఒకరి తర్వాత ఒకరు టీకా వేయించుకున్నారు.ఈ ఫొటోలను విగ్నేష్ శివన్ తన ఇన్స్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఆన్ లైన్ వేదికలపై తెగ చక్కర్లు కొడుతున్నాయి.”అందరూ టీకాలు వేయించుకొని సురక్షితంగా ఉండండి, ఇంట్లోనే ఉండండి” అని ఆయన ట్యాగ్ చేశారు.ఇకపోతే గత కొంతకాలంగా నయన్- విగ్నేష్ పెళ్లి మ్యాటర్ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది పెళ్లి తంతు ముగుస్తుందని అన్నారు.అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో పెళ్లి విషయమై నయన్ కీలక నిర్ణయం తీసుకుందని, కరోనా ఎఫెక్ట్ తగ్గాకే వచ్చే ఏడాది వివాహం చేసుకుందామని చెప్పి ప్రియుడిని ఒప్పించిందని తెలిసింది.
మరి ఇంతలా హల్చల్ చేస్తున్న ఈ లవ్ బర్డ్స్ ఎప్పుడు ఒక్కటవుతారనేది తెలియాలంటే మరికొంత కాలం ఎదురుచూడాల్సిందే.