కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ‘లింగ’ మూవీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని నటిస్తున్న సినిమాకు రంగం సిద్దం అయ్యింది.ఇప్పటికే ఈ సినిమాకు రంజిత్ను దర్శకుడిగా ఎంపిక చేసినట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.
చాలా కాలం తర్వాత రజినీకాంత్ తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాను చేస్తున్నాడు.ఒకే సమయంలో రెండు భాషల్లో కూడా చిత్రీకరించనున్నారు.
తక్కువ బడ్జెట్తో రజినీకాంత్ గత స్టైల్ను ప్రేక్షకులకు చూపించేందుకు దర్శకుడు రంజిత్ ప్లాన్ చేస్తున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్గా నయనతారను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.
ద్విభాష చిత్రం కనుక తెలుగు మరియు తమిళంలో గుర్తింపు ఉన్న హీరోయిన్ అయితే బాగుంటుందని భావించిన దర్శకుడు నయన్ను ఫైనల్ చేశాడు.ఇప్పటికే రజినీకాంత్తో ఈ అమ్మడు రెండు సార్లు స్క్రీన్ షేర్ చేసుకుంది.
‘చంద్రముఖి’ మరియు ‘కథానాయకుడు’ సినిమాల్లో రజినీతో కలిసి నటించిన నయనతార మరోసారి సూపర్ స్టార్తో కలిసి నటించే అవకాశం దక్కించుకుంది.ప్రస్తుతం తమిళంలో ఎన్నో సినిమాలు చేస్తున్న నయన్ ఎంతో బిజీగా ఉన్నా కూడా రజినీకాంత్ కోసం వెంటనే డేట్స్ను కేటాయించింది.
తెలుగు తమిళ:లో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో అని ఇప్పటి నుండి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.