చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.సైరా చిత్రం విడుదలకు నెల రోజుల సమయం కూడా లేదు.
దాంతో మెగా ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా, రామ్ చరణ్ నిర్మించాడు.
భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంలో హీరోయిన్గా నయనతారను నటింపజేయడం జరిగింది.ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భార్య పాత్రలో నయనతార నటించడం జరిగింది.
ఈ చిత్రం కోసం నయనతార తీసుకున్న పారితోషికం గురించి వార్తలు వస్తున్నాయి.
సైరా చిత్రంలో నయనతార నటించేందుకు దాదాపుగా ఆరు కోట్ల రూపాయలను తీసుకుందట.
తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా మంచి ఫాలోయింగ్ను కలిగి ఉన్న నయనతార సైరాలో నటించేందుకు ఏకంగా ఆరు కోట్లకు పైగా అడిగిందని, చిరంజీవికి జోడిగా ఆమె తప్ప మరెవ్వరు సూట్ అవ్వరనే ఉద్దేశ్యంతో ఆమె పారితోషిక ఎక్కువ అయినా కూడా తప్పదన్నట్లుగా ఎంపిక చేయడం జరిగింది.అంత భారీ బడ్జెట్ చిత్రంకు హీరోయిన్ పారితోషికం ఈమత్రం అయినా ఉండాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగారు.
సినిమాలో చిరంజీవితో పాటు ఇంకా పలువురు నటీనటులు కూడా ఈ చిత్రంలో నటించారు.మరి అలాంటిది వారికి లేని భారీ పారితోషికం ఈమెకే ఎలా వచ్చిందని అనుకుంటున్నారా.ఇతర నటీనటులతో పోల్చితే ఈ చిత్రం కోసం నయనతార చాలా ఎక్కువ రోజుల కాల్షీట్లను ఇవ్వడం జరిగింది.అందుకే ఆమెకు రెట్టింపు పారితోషికం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.ఇతర హీరోల పారితోషికాల విషయంలో కాస్త అటు ఇటు అయ్యి ఉంటుందేమో కాని నయనతార పారితోషికం విషయంలో తగ్గకుండా భారీ మొత్తంను వసూళ్లు చేసుకుని బయట పడింది.