కోలీవుడ్ స్టార్ బ్యూటీ నయనతార ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ వాటిని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లుగా మలుస్తోంది.ఇప్పటికే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ వస్తున్న నయన్, అటు టాప్ హీరోల సరసన కూడా నటిస్తోంది.
కాగా ఆమె నటించిన తాజా చిత్రం ‘నెట్రికన్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూతపడటంతో ఈ సినిమా రిలీజ్ అయోమయంలో పడింది.
నట్రికన్ చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యింది.కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావడం అసాధ్యమని, అందుకే ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలని నయనతార అభిమానులు కోరారు.
అయితే ఈ సినిమాకు పలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుండి మంచి క్రేజీ రేటు లభించినట్లు తెలుస్తోంది.దీంతో ఎట్టకేలకు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు అంగీకరించినట్లు చిత్రవర్గాలు అంటున్నాయి.
అసలే నయన్ చిత్రం కావడంతో, ఈ సినిమాకు ఓటీటీ నుండి భారీ రేటు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో నయనతార కంటిచూపులేని పాత్రలో నటిస్తుందట.
తన వినికిడి శక్తిని ఉపయోగించి ఓ సీరియల్ హంతకుడిని నయనతార ఎలా పట్టుకుందనేది ఈ సినిమా కధగా ప్రేక్షకులను మెప్పించనున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో నయన్ పర్ఫార్మెన్స్ మరో లెవెల్లో ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.
కాగా ఈ సినిమాను ‘గృహం’ చిత్ర దర్శకుడు మిలింద్ రావ్ తెరకెక్కించడంతో ఈ సినిమాలో సస్పెన్స్ అంశాలు పుష్కలంగా ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు.మరి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ను దక్కించుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
ఈ సినిమాను జూలై నెలలో డిస్నీ హాట్స్టార్ ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.