సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ ని విజయశాంతి తర్వాత స్టార్ హీరోయిన్ నయనతార సొంతం చేసుకుందని చెప్పాలి.సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ బ్యూటీ ఇప్పటికి తన హవా కొనసాగిస్తుంది.
తెలుగులో ఈ బ్యూటీ సినిమాలు తగ్గించేసిన తమిళంలో మాత్రం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.అక్కడ ఫిమేల్ సెంట్రిక్ కథలతో హీరోలతో సమానమైన మార్కెట్ సొంతం చేసుకొని సినిమాలు చేస్తుంది.
నయనతార సినిమా అంటే 50 కోట్ల కలెక్షన్ గ్యారెంటీ అనే టాక్ కోలీవుడ్ లో ఉంది.నయనతార సినిమా అంటే ప్రత్యేకంగా ఆమె మీడియా ముందుకి వచ్చి ప్రమోషన్స్ లో పాల్గొనాల్సిన అవసరం కూడా లేదు.
ఆమె బ్రాండ్ ఉంటే సినిమాని బయ్యర్లు ఎగబడి కొనేస్తారు.ఇదిలా ఉంటే.
కరోనా ఎఫెక్ట్ వలన గత ఏడాదిలో నయనతార చేసిన సినిమాలలో ఒకే ఒకటి ఒటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.మక్కుత్తి అమ్మన్ టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార అమ్మవారిగా నటించింది.
ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.స్వామీజీల మీద సెటైరికల్ గా ఈ మూవీని తెరకెక్కించారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు నయనతార మాతృభాష అయిన మలయాళంలో నిజల్ అనే సినిమాలో నటించింది.థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో ఒటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.
డాల్బీ ఒటీటీ చానల్ లో ఈ సినిమా ఆదివారం రిలీజ్ కాబోతుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం రజినీకాంత్ కి జోడీగా అన్నాత్తై సినిమాలో నయనతార నటిస్తుంది.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.దీని తర్వాత తన ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా నయన్ చేయబోతుంది.
అయితే సైరా తర్వాత మరో తెలుగు సినిమాని ఇప్పటి వరకు నయనతార ఒప్పుకోకపోవడం గమనార్హం.