సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు.ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.
కీర్తి సురేష్ ఈ సినిమాలో మహేష్ కి జోడీగా నటిస్తుంది.ఇదిలా ఉంటే దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సూపర్ స్టార్ మహేష్ రెడీ అయిన సంగతి తెలిసిందే.
ఈ మూవీ కథ కూడా ఇప్పటికే రెడీ అయినట్లు తెలుస్తుంది.భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ మూవీ త్రివిక్రమ్ స్టైల్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు థ్రిల్లర్ అంశాలు కూడా ఉంటాయనే టాక్ వినిపిస్తుంది.
ఇందులో మహేష్ బాబు సీక్రెట్ ఏజెంట్ గా కనిపిస్తాడనే మాట వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రల కోసం బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లు పరిశీలించారు.
అలాగే టాలీవుడ్ లో స్టార్ కథానాయికలు అయిన పూజా హెగ్డే, రష్మిక పేర్లు కూడా పరిశీలించారు.అయితే ఇప్పుడు ఎవ్వరూ ఊహించని విధంగా ఓ కొత్త పేరు తెరపైకి వచ్చింది.
సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా కోలీవుడ్ లో ఫిమేల్ సెంట్రిక్, స్టార్ కథానాయికగా దూసుకుపోతున్న అందాల భామ నయనతారని హీరోయిన్ గా ఖరారు చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.సినిమాలో పాత్ర ప్రాధాన్యత బట్టి త్రివిక్రమ్ నయనతారని సెలక్ట్ చేసుకున్నారని టాక్.
ఇక ఆమె కూడా మహేష్ కి జోడీగా నటించడానికి ఒకే చెప్పెసినట్లు తెలుస్తుంది.ఇప్పటికే కోలీవుడ్ విజయ్, విజయ్ సేతుపతి లాంటి హీరోలకి ఆమె జోడీగా నటిస్తుంది.
అయితే తెలుగులో సీనియర్ హీరోల కోసమే నయనతారని సెలక్ట్ చేస్తున్నారు.ఇప్పుడు త్రివిక్రమ్ ఊహించని విధంగా మహేష్ కి జోడీగా ఎంపిక చేయడం టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది.