కోలీవుడ్ ప్రేమ జంట నయనతార,విఘ్నేష్ ల గురించి మనందరికీ తెలిసిందే.గత నాలుగైదు రోజులుగా వీరిద్దరి పేర్లు సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి.
అయితే అందుకు గల కారణం కూడా లేకపోలేదు.కోలీవుడ్ సినీ ప్రేక్షకుల తో పాటు ఇతర సినీ ఇండస్ట్రీలో ప్రేక్షకులు అభిమానులు ఈ జంట ఎప్పుడెప్పుడు మూడుముళ్ల బంధంతో ఒక్కటి ఉంది అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
అయితే ఇప్పటికే ఈ జంట వివాహ బంధంతో ఒక్కటి కావాల్సి ఉండగా ఇప్పటికే పలుసార్లు పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది.ఇక ఎట్టకేలకు ఈ జంట రేపు నెల అనగా జూన్ 9న వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు.
దీనితో వీరిద్దరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి.నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ లు వారి పెళ్లి షాపింగ్, ఆహ్వానపత్రికలు పంపడం, పెళ్లి వేడుకలకు సంబంధించిన ప్లాన్స్తో బిజీ బిజీగా ఉన్నారు.జూన్ 9న జరగబోయే ఈ జంట పెళ్లికి బంధువులు, అతి కొద్దిమంది సన్నిహితుల హాజరుకానున్నారు.
అయితే ఇప్పటికే కొందరు అతిథులకు డిజిటల్ వీడియో ఇన్విటేషన్ కార్డ్ ని కూడా పంపించారట.ఆ వీడియో ఇన్విటేషన్ ప్రస్తుతం వైరల్గా మారింది.
అయితే ఆ వీడియో ఇన్విటేషన్ పత్రిక ప్రకారం నయనతార, విఘ్నేష్ తమిళనాడులోని మహాబలిపురంలో పెళ్లాడనున్నట్లు తెలుస్తోంది.అయితే నిన్న మొన్నటి వరకు తిరుపతిలో పెళ్లి అని వార్తలు వినిపించిన్ సంగతి తెలిసిందే.ఇప్పుడు మహాబలిపురం అని ఇన్విటేషన్ స్పష్టం చేస్తోంది.ఓ రిసార్ట్లో వీరి పెళ్లి వేడుక జరుగబోతోందట.కాగా ఆకాశం, అందమైన ఇల్లు, చుట్టూ పచ్చని చెట్లతో డిజైన్ చేసిన డిజిటల్ ఇన్విటేషన్ కార్డ్ అదిరిందనే ప్రశంసలు వినిపిస్తున్నాయి.