కొంత మందికి వయస్సు పెరిగే కొద్దీ వారి అందం కూడా అలాగే పెరుగుతూ ఉంటుంది.ఇలాంటి విషయం ఎక్కువగా సినీ తారలలో మనం గమనిస్తూ ఉంటాము.
అందులో నయనతార కూడా చేరుతుంది.నయనతార వయస్సు ఒకవైపు పెరుగుతుంటే ఆమె ఇమేజ్ కూడా దానికి పదింతలు రోజురోజుకు పెరుగుతూ ఉంటుంది.
తను ఎంచుకున్న పాత్రలు కూడా డిఫరెంట్ గా ఉంటూ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.ముఖ్యంగా నయనతార నటించిన సినిమాల్లో హీరోతో అవసరంలేదని స్థాయికి ఆవిడ ఎదిగిపోయింది.
దీంతో ఆమెతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేయడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు.అందుకే కాబోలు గత ఐదు సంవత్సరాల నుంచి నయనతార వరుస పెట్టి మరీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ సౌత్ సినిమా ఇండస్ట్రీ ప్రజలను ఆకట్టుకుంటోంది.
లేడి ఓరియెంటెడ్ సినిమాలు అయినా సరే అందులో చాలావరకు విజయాలను అందుకుంది నయనతార.
నిజానికి నయనతార సక్సెస్ రేటు చూస్తే కొంత మంది హీరోలు కూడా అంతలా హిట్స్ వచ్చిండదు కాబోలు.
ఇకపోతే తాజాగా నయనతార అమ్మవారి పాత్రలో చేసిన పర్ఫామెన్స్ ఓ స్థాయిలో కనబడుతోంది.తమిళ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్.జె.బాలాజీ దర్శకుడిగా మారి తన స్నేహితుడు శరవణన్ తో కలిసి నయనతార తో సినిమా చేస్తున్నారు.ఈ సినిమాను తమిళ ఇండస్ట్రీలో మూకూతి అమ్మన్ గా తెరకెక్కిస్తున్నారు.తెలుగులో మాత్రం ఈ సినిమాకి అమ్మోరు తల్లి అనే పేరును ఖరారు చేశారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆ చిత్ర బృందం ట్రైలర్ ను విడుదల చేసింది.ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఇదివరకు వచ్చిన సినిమా వలే ఈ సినిమా కూడా కనబడుతోంది.
ట్రైలర్ విషయానికి వస్తే.దేవుడికి, మనిషికి మధ్య పోరాటం జరుపుతున్నట్లు కనబడుతోంది.ఒక వ్యక్తి దేవుడి పేరు చెప్పి ఎంతో పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్న దొంగబాబా లను టార్గెట్ చేసే విధంగా ఈ ట్రైలర్ రూపొందుకుంది.ఇక ఈ సినిమాలో దొంగ బాబాగా తెలుగు నటుడు అజయ్ జోష్ నటించబోతున్నారు.
దీపావళి పండుగ సందర్భంగా హాట్ స్టార్ లో ఈ సినిమా ఓటిటి ప్లాట్ ఫామ్ ద్వారా విడుదల కాబోతోంది.ఇకపోతే ఇండస్ట్రీలో భారీ విజయం కోసం ఎదురుచూస్తున్న నయనతార అమ్మోరు తల్లి ద్వారా ఖచ్చితంగా భారీ హిట్ సాధిస్తుందని గట్టి నమ్మకంతో ఉంది.
చూడాలి మరి ఆ అమ్మోరు తల్లి ఈ అమ్మోరు తల్లిని కనుకరిస్తుందో లేదో.