కోలీవుడ్, టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ నయనతార ఆ మద్య ప్రభుదేవాను పెళ్లి చేసుకునేందుకు క్రిస్టియన్ నుండి హిందు మతంకు మారిన విషయం తెల్సిందే.అయితే ప్రభుదేవాతో ప్రేమ పెటాకులు అయ్యింది.
ఇద్దరు కూడా పెళ్లి వరకు వెళ్లి వదనుకున్నారు.పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత కొన్నాళ్ల పాటు ఎవరికి కనిపించకుండా ఉన్న నయన్ మళ్లీ సినిమాలతో చాలా బిజీ బిజీగా గడుపుతోంది.
తాజాగా ఈమె గురించిన ఒక ఆసక్తికర విషయం తమిళ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.ఈ అమ్మడు తాజాగా మళ్లీ మతం మారిందని, తన కుటుంబం అవలంభిస్తున్న క్రిస్టియన్ మతంనే మళ్లీ ఈమె స్వీకరించింది.
తాజాగా రోమ్లో ఒక ప్రముఖ చర్చిలో పోప్ను ఈమె కలిసినట్లుగా చెబుతున్నారు.మనస్సు ప్రశాంతత కోసం ఆయన వద్ద కొన్ని సలహాలు మరియు సూచనలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
సినిమాలతో ఇంత బిజీగా ఉన్న నయన్కు ఇప్పుడు మనస్సు ప్రశాంతత ఎందుకా అని తమిళ సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు చెవులు కొరుకుంటున్నారు.నయన్ మనస్సు నుండి ఇంకా పాత జ్ఞాపకాలు వెళ్లి పోలేదేమో అని కొందరు అంటున్నారు.
మొత్తానికి నయన్ మత మార్పిడి విషయం కూడా మీడియాలో ప్రధాన వార్త అయ్యింది.