సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస సినిమాలతో జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది.ఎక్కువగా ఫీమేల్ సెంట్రిక్ కథలు చేస్తూ కోలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా ఉంది.
ఇదిలా ఉంటే కోలీవుడ్ లో కేవలం సినిమాలతోనే కాకుండా తన లవ్ స్టోరీలతో కూడా నయనతార మొదటి నుంచి హాట్ టాపిక్ గా ఉంటుంది.కెరియర్ ఆరంభంలో శింబుతో ప్రేమాయణం తరువాత బ్రేక్ అప్ కథ గురించి అందరికి తెలిసిందే.
తరువాత ప్రభుదేవా నయనతార కోసం తాను కట్టుకున్న భార్యకి విడాకులు ఇచ్చేశాడు.తరువాత వారిద్దరి కథ కంచికే చేరింది.
ఈ మధ్యనే ప్రభుదేవా మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు.ఇదిలా ఉంటే ప్రస్తుతం నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమాయణం సాగిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.
వీళ్లిద్దరు వీకెండ్ దొరికితే ఏదో ఒక దేశం వెళ్ళిపోయి హ్యాపీగా గడిపి వస్తూ ఉంటారు.వారి ప్రేమ ప్రయాణం గురించి ఇప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంటారు.
ఇదిలా ఉంటే నయనతార, విగ్నేష్ పెళ్లి గురించి ఎప్పటి నుంచో టాపిక్ నడుస్తుంది.2015 నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు.అయితే వీరి ప్రేమ ఇప్పుడు పెళ్లి దశకి చేరుకుంది.గత ఏడాది పెళ్లి చేసుకోవాలని అనుకున్న లాక్ డౌన్ అడ్డుపడింది.అయితే ఈ సారి ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.ఫిబ్రవరిలో వీరిద్దరూ జత కాబోతున్నారని, డేట్ కూడా ఫిక్స్ చేశారని టాక్.
కొద్ది రోజుల క్రితం వీరిద్దరూ తిరుపతి వెంకన్న దర్శనం చేసుకున్నారు.దీంతో వీరి పెళ్లికి ముహూర్తం కన్ఫర్మ్ అయ్యిందని మరోసారి టాక్ వచ్చింది.
ఇక ఫిబ్రవరిలో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరుగుతుందని తెలుస్తుంది.