స్టైలిష్ డైరక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని తెరక్కేకించిన చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’.ఈ చిత్రంలో మెగా స్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ పాత్రలో నటించాడు.
ప్రపంచ వ్యాప్తంగా సైరా నరసింహా రెడ్డి చిత్రాన్ని ఇటివల విడుదల చెయ్యడం జరిగింది.సినిమా మొదటి రోజునుండి పాజిటివ్ టాక్ ను దక్కించుకుని బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది.
ఈ చిత్రంలో తమిళ హీరొయిన్ నయనతార చిరంజీవి సరసన నటించింది.నయన్ కి ఉన్న క్రేజీ వలన ఆమెకు పారితోషకం కూడా 6 కోట్ల వరకు చిత్ర నిర్మాత రామ్ చరణ్ ముట్ట జెప్పాడని సమాచారం.
వరస విజయాలతో తెలుగు,తమిళంలో దూసుకుపోతున్న నయన్ సైరా నరసింహా రెడ్డి విషయంలో కాస్త అసంతృప్తితో ఉన్నారంట.దీనికి ముఖ్య కారణం తన పేరును ఏ వేదికపైన ఉపయోగించకపోవడంని తెలుస్తుంది.‘సైరా’ సినిమా పూర్తైనప్పటినుండి, సినిమా ప్రమోషన్స్ లో నయన్ పేరు కంటే ఎక్కువగా తమన్నా పేరును చిత్ర బృందం జప్పించడం వలన నయన్ అసంతృప్తితో ఉన్నారంట.‘సైరా నరసింహా రెడ్డి’ చిత్రంలో తమన్నా పాత్ర చిన్నదైన, ఆ పాత్రకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.ఇకా నయన్ సైరా ఆడియో ఫంక్షన్ కి రాకపోవడానికి కూడా కారణాలు లేకపోలేదు.సైరా చిత్రంలో తమన్నా కు అధిక ప్రాముఖ్యత ఇవ్వడం వల్లనే, నయన్ ‘సైరా’ ఆడియో ఫంక్షన్ కి రాలేదని తన సన్నిహితుల వైపు నుండి ఓ మాట వినిపిస్తుంది.