తెలుగులో దాదాపుగా సీనియర్ నుంచి జూనియర్ వరకు దాదాపు అందరి స్టార్ హీరోలను కవర్ చేస్తూ నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన కోలీవుడ్ బ్యూటీ నయనతార గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే తాజాగా ఈ అమ్మడికి సంబంధించిన ఓ ఫోటో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఆ ఫోటో ని ఒకసారి పరిశీలించినట్లయితే తన నయనతారకి తన ప్రియుడు విగ్నేష్ శివన్ ముద్దు పెడుతూ తీసుకున్నట్లు తెలుస్తోంది.దీంతో ఈ ఫోటోని ప్రస్తుతం నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
అంతేగాక ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వ అధికారులు భౌతిక దూరం పాటించాలని చెబుతున్నప్పటికీ ఈ కరోనా టైమ్ లో ముద్దులు పెట్టుకోవడం అవసరమా అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.మరికొందరు మాత్రం ఈ ఫోటోలు నయనతార మరియు విగ్నేష్ శివన్ కలిసి ఎప్పుడు తీసుకున్నవని కొందరు ట్రోలర్స్ ఈ ఫోటోలను కావాలనే వైరల్ చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా కోలీవుడ్ ప్రముఖు దర్శకుడు మిలింద్ రాజు దర్శకత్వం వహిస్తున్న నేట్రికాయాన్ అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.అలాగే తెలుగులో దర్శకుడు బోయపాటి శ్రీను మరియు బాలయ్య బాబు కాంబినేషన్ లో చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.