టాలీవుడ్ కోలీవుడ్ లో గత పదేళ్లుగా టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న నయనతార ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.అతడితో పెళ్లి విషయం గురించి స్పందించని నయనతార రెగ్యులర్ గా అతడితో విహార యాత్రలు చేస్తోంది.
సమయం దొరికినప్పుడల్లా ఎక్కువగా హాలిడేస్ కి వెళ్తున్న నయనతార విఘ్నేష్ శివన్ లు ఇటీవల గోవా ట్రిప్ వెళ్లారు.ప్రతి మూడు నాలుగు నెలలకో సారి విదేశాలకు వెళ్ళే వీరిద్దరూ కరోనా కారణంగా ఈసారి విదేశాలకు వెళ్లకుండా గోవా వెళ్లారు.
గోవా ట్రిప్ కోసం ప్రత్యేక విమానాన్ని కూడా బుక్ చేసుకున్న నయనతార అక్కడ ఏకంగా ఒక రిసార్ట్ ను తీసుకున్నట్లుగా తెలుస్తోంది.మొత్తం మీద వారం రోజుల హాలిడే గాను నయనతార ఏకంగా పాతిక లక్షల రూపాయలను ఖర్చు చేసినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అందుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా వారు చూపిస్తున్నారు.ఒక్క సినిమాకు మూడు నుంచి ఐదు కోట్ల పారితోషికం తీసుకుంటున్న నయనతారకు పాతిక లక్షల ఖర్చు అంటే పెద్ద సమస్య కాదు.
కానీ ఈ సమయంలో పాతిక లక్షలు ఖర్చు చేయడం అంటే చాలా పెద్ద విషయం అంటూ సినీ వర్గాల వారు కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.సినిమాలు లేని ఈ సమయంలో ఆమె తన టైంలో ప్రియుడితో గడపాలి అనుకోవడం తప్పు కాదని దానికి ఆమె సొంత డబ్బులు ఖర్చు చేసుకుంటే ఇతరులు ఎందుకు గొడవ చేస్తున్నారని ఆమె అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
ఆమె ఇప్పటికే కరోనా కారణంగా ఇబ్బందుల్లో ఉన్న కార్మికులకు తన వంతు సాయం చేశారు.అయిన ఆమెను ఎందుకు విమర్శిస్తున్నారు అనే విషయం అర్థం కావట్లేదని ఆమె అభిమానులు వాపోతున్నారు.
వచ్చే నెల నుండి ఆమె తన కొత్త సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతుంది.అందుకే కాస్త ప్రశాంతత కోసం గోవాకు ప్రియుడితో కలిసి వెళ్ళింది అని ఆమె సన్నిహితులు అంటున్నారు.
ఆమె ఏం చేసినా వివాదాస్పదం అవుతుంది అనడానికి ఇది మరో ప్రత్యక్ష సాక్ష్యం అనడంలో ఎలాంటి సందేహం లేదు.