స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వం లో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మూవీ ఉంటుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.గత కొన్నాళ్లుగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు ఎట్టకేలకు గుడ్ న్యూస్ వచ్చింది.
ఈ సినిమా ను అతి త్వరలోనే పట్టాలెక్కించబోతున్నట్లుగా ప్రకటించారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కుదుట పడ్డ తర్వాత సినిమా షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.
అట్లీ మాట్లాడుతూ షారుఖ్ ఖాన్ తో ఒక పక్కా కమర్షియల్ మూవీని చేయబోతున్నట్లుగా పేర్కొన్నాడు.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నయన తారను ఎంపిక చేసే విషయమై చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నయనతార కు షారుఖ్ ఖాన్ కూడా దాదాపుగా ఓకే చెప్పాడని తెలుస్తోంది.
అట్లీ కుమార్ దర్శకత్వం లో ఇప్పటికే నయన్ రెండు సినిమా లు చేసింది.
అట్లీ దర్శకత్వం లో వచ్చిన మొదటి సినిమా లో నయన్ హీరోయిన్ గా నటించింది.అందుకే సెంటిమెంట్ గా ఆమెను ఈ సినిమా లో నటింపజేయాలని ఆయన భావిస్తున్నాడు.
షారుఖ్ ఖాన్ ప్రస్తుతం చేస్తున్న పఠాన్ సినిమా ఫలితంపై అనుమానాలు ఉన్నాయి.కనుక కనుక ఈ సమయంలో ఆయనతో నటించడం అంటే కాస్త సాహసమే అంటున్నారు.
గడచిన అయిదు ఆరు సంవత్సరాలుగా షారుఖ్ ఖాన్ సినిమా లు అంటే జనాలు లైట్ తీసుకుంటున్నారు.అందుకే ఈ సారి ఆయన సినిమా లో నయన్ నటించడం ఏమాత్రం కరెక్ట్ కాదని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కాని అట్లీ మాత్రం ఈ సినిమా తో ఖచ్చితంగా సక్సెస్ కొడతానంటూ ధీమాగా ఉన్నాడు.ఇలాంటి సమయంలో నయనతార ఫ్యాన్స్ మాత్రం కాస్త టెన్షన్ పడుతున్నారు.