లేడీ ఓరియెంటెడ్ పాత్రలు పోషించాలంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు విజయశాంతి.ఒక్కప్పుడు సినిమా హీరోల పక్కన కథానాయకగా నటిస్తూనే హీరోయిజం ఉన్న పాత్రల్లో విజయశాంతి నటించేది.
ఇప్పుడు ఇలాంటి పాత్రలు చెయ్యాలంటే ఒక్కటి అనుష్క, రెండొవది నయనతార.నయన్ లేడీ సూపర్ స్టార్ గా మంచి పేరు దక్కించుకుంది.
అలాంటి నయనతార తను నటించిన గజిని చిత్రం పై అసహనం వ్యక్తం చేసింది.దీనికి కారణం కూడా లేకపోలేదు.2005లో మురగదాస్ దర్శకత్వంలో సూర్య, అసిన్ కలిసి జంటగా నటించిన చిత్రం గజిని.
ఈ చిత్రం అప్పట్లో పెద్ద విజయాన్ని దక్కించుకుంది.ఆ సినిమాలో నయనతార ‘చిత్రా’ అనే పాత్రల్లో నటించింది.‘చిత్రా’ అనే పాత్రలో నటించి తప్పు చేశానని ఆ తరువాత చాల బాధ పడ్డాను.నిజానికి అసిన్ తో సమానంగా నా పాత్ర ఉంటుంది అనుకున్నాను.అంతగా ఆ పాత్రకు ఏమి గుర్తింపు రాలేదు.ఈ విషయం తెలిసి చాలా పశ్చాత్తాప పడ్డానని నయన్ అన్నారు.కానీ ఇప్పుడు నయన్ సినిమాలు ఎంచుకోవడం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.
ప్రస్తుతం నయన్ సూపర్ స్టార్ రజినీకాంత్ సరసున దర్బార్ అనే చిత్రంలో కథానాయకగా నటిస్తుంది.తెలుగులో సైరా నరసింహా రెడ్డి చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.