సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ ఎవరు అంటే కళ్ళుమూసుకొని చెప్పేయచ్చు.నయనతార అని.మలయాళికి చెందిన ఈ బ్యూటీ కొన్నేళ్లుగా సూపర్ హీరోయిన్ గా కొనసాగుతుంది.2003లో సత్యన్ అంతికాడ్ దర్శకత్వంలో వచ్చిన మనస్సినక్కరే చిత్రంలో తొలిసారిగా మలయాళంలో నటించింది ఈ ముద్దుగుమ్మ.తరువాత తెలుగులో చంద్రముఖి చిత్రంతో పరిచయం కాగా లక్ష్మి సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది ఈ భామ.
తెలుగు, మలయాళం, తమిళం భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ.ఇదిలా ఉండగా వల్లవన్ సినిమాలో శింబుతో కలిసి నటించగా ఆ సమయంలోనే శింబుతో ప్రేమలో పడింది.అయితే ఏమైందో తెలియదు కానీ కొన్ని రోజుల తర్వాత శింబూతో ఆమె విడిపోయినట్టు వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత హీరో ప్రభుదేవాతో ప్రేమలో ఉన్నట్లు, పెళ్లి కూడా చేసుకుంటున్నట్టు అప్పట్లో చెప్పగా అతనితో కూడా విడిపోయింది.
ఇక ఆమె జీవితంలో ప్రేమ అనేదే ఉండదు ఏమో అనుకున్న సమయంలో నేను రౌడీనే సినిమాలో నటించిన సమయంలో దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది.
అతడికి తన సొంత పేరు కంటే నయనతార బాయ్ ఫ్రెండ్ గానే ఎక్కువగా గుర్తింపు వచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నప్పుడు ఆ సినీ దర్శకుడైనా విఘ్నేష్ తనను ఇష్టపడ్డాడు.
కానీ తనకంటూ ఒక పేరు, గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు విఘ్నేష్ శివన్.నయనతారతో వుంటూ సినిమాలను దూరం పెట్టాడు.కాగా ఇటీవలే నయనతార , సమంతతో కలిసి ఒక చిత్రాన్ని తీయాలని నిర్ణయించుకున్నారు.
త్వరలోనే సినిమాను మొదలు పెట్టడానికి ప్లాన్ లో ఉండగా….విఘ్నేష్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు.“వచ్చేవాళ్లు టైటానిక్ షిప్ లా ఉండాలి అని అంచనా వేస్తుంటారు… కానీ వాళ్ళు ఇచ్చే డబ్బు ఇస్త్రీ పెట్టె అంతా ఇస్తామని చెబుతున్నారు” అంటూ తన మనసులో బాధను సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.దీంతో అతను చేసిన పోస్ట్ ఎవరి గురించి అంటూ చర్చించుకుంటున్నారు ఇండస్ట్రీలో ప్రముఖులు.