టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించిన లేడీస్ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కెరీర్ బిగినింగ్ లో నయనతార గ్లామరస్ పాత్రలు చేసినా కూడ ఈ మధ్యకాలంలో నటనకి ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన పాత్రలలో మాత్రమే నటిస్తూ.
లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.ఇదిలా ఉండగా ఇటీవల నయనతార ప్రముఖ తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
చాలాకాలం ప్రేమించుకున్న వీరిద్దరూ ఇటీవల వివాహ బంధంతో ఒకటయ్యారు.సాధారణంగా పెళ్లి జరిగిన తర్వాత ప్రతి అమ్మాయి పసుపు తాడుని ఒక వారం లేదా రెండు వారాలు మెడలో ఉంచుకుంటుంది.
కానీ నయనతార పెళ్లి జరిగి నెల రోజులు అవుతున్నా కూడా మెడలో నుండి పసుపు తాడు మాత్రం తీయలేదు.ఎక్కడికి వెళ్ళినా ఆ పసుపు తాడుతోనే కనిపిస్తుంది.
అయితే నయనతార ఇలా బంగారు తాళికి బదులు సాధారణ పసుపుతాడు ఇన్నిరోజులు మెడలో ఉంచుకోవటానికి కారణం ఏంటి అని అందరూ అనుమాన పడుతున్నారు.అయితే నయనతార మాత్రం విగ్నేష్ తన మెడలో కట్టిన ఆ పసుపుతాడుని సెంటిమెంట్ గా భావిస్తున్నట్లు సమాచారం.
అందుకే పెళ్లి జరిగి నెల రోజులైనా నయనతార ఆ పసుపు తాడుని తీయకుండా అలాగే ఉంచుకుంది.
అయితే సినిమాల విషయంలో మాత్రం నయనతార వెనుకడుగు వేయడం లేదు.పెళ్లి జరిగినా కూడా ముందులాగే సినిమాలలో నటిస్తానని ఇప్పటికే ప్రకటించింది.కానీ నిర్మాతలకి కొన్ని కండిషన్స్ మాత్రం పెట్టింది.
నయనతార ప్రస్తుతం షారుక్ ఖాన్ సినిమాలో నటిస్తోంది.ఈ సినిమాతో నయనతార బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది.
ఈ సినిమా షూటింగ్ కోసం నయనతార ప్రస్తుతం ముంబై వెళ్ళింది.ఇక తెలుగులో కూడా నయనతార చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తోంది.
ఈ సినిమా దసరా కానుకగా విడుదల చేయటానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.