ఆచార్య తర్వాత లూసిఫర్ రీమేక్ ను దానితో పాటు కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి.
లూసిఫర్ రీమేక్ ను కోలీవుడ్ డైరక్టర్ మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు.ఆ సినిమా తో పాటుగా కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో సినిమా కూడా ఒకే సారి సెట్స్ మీదకు వెళ్తుంది.బాబీ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నవాజుద్ధిన్ సిద్ధిఖీ కూడా నటిస్తాడని టాక్.
బాబీ ఆల్రెడీ ఈ సినిమా కథను నవాజుద్దీన్ సిద్దిఖీకి వినిపించారట.ఆయన నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది.
సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేసే నవాజుద్దీన్ సిద్ధిఖీ తెలుగులో మొదటిసారి మెగా మూవీకి సైన్ చేసినట్టు తెలుస్తుంది.ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషని అనుకుంటున్నారు.
చిరు సినిమాతో మరోసారి తెలుగులో బిజీ అవ్వాలని చూస్తుంది చెన్నై చిన్నది త్రిష.లూసిఫర్ రీమేక్ తో పాటుగా బాబీ సినిమాను కూడా పార్లర్ గా షూట్ చేయాలని చూస్తున్నారు చిరంజీవి.
ఇక కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న ఆచార్య సినిమాకు మరో 15 రోజుల షూటింగ్ పెండింగ్ ఉందని తెలుస్తుంది.అది కాస్త పూర్తయితే సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తారని ఫిల్మ్ నగర్ టాక్.