తెలుగు బుల్లి తెర స్టార్స్ పలువురు కరోనా వైరస్ బారిన పడుతున్నారు.ఇప్పటికే కొందరు రికవరీ అవ్వగా మరికొందరు కూడా ఇంకా వైరస్తో ఉన్నారు.
ఈసమయంలోనే నా పేరు మీనాక్షితో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని ప్రస్తుతం తెలుగు బుల్లి తెరపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న ముద్దుగుమ్మ నవ్య సామి కూడా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది.తాజాగా ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చింది.
మీడియాలో వార్తలు వస్తున్నట్లుగా తనకు కరోనా పాజిటివ్ అంటూ పేర్కొంది.ప్రస్తుతం తాను పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యాను.నా డాక్టర్ సూచించిన మేరకు ఐసోలేషన్లో జాగ్రత్తలు తీసుకుంటున్నాను.ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటున్నాను.
ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా నేను ఉన్నాను.నాతో ఎవరైతే కాంటాక్ట్ అయ్యారో వారు దయచేసి జాగ్రత్తగా ఉండండి.
వారికి వారు ఐసోలేషన్ అవ్వండి.ఏమైనా అనుమానం ఉంటే టెస్టుకు వెళ్లండి అంటూ సూచించింది.
ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అస్సలు పుకార్లు పట్టించుకోకుండా జాగ్రత్తగా ఉండండి అంటూ తన ఫాలోవర్స్కు తెలియజేసింది.ఇదే సమయంలో కరోనా రాకుండా జాగ్రత్తగా ఉండాలని కూడా పేర్కొంది.
ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటేనే వైరస్ చైన్ను కట్ చేయగలమని చెప్పింది.త్వరలో మళ్లీ తనను బుల్లి తెరపై చూస్తారంటూ ఆశాభావం వ్యక్తం చేసింది.