ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో కొన్ని టీవీ ఛానెళ్లు రీల్ లైఫ్ కపుల్స్ పెళ్లి చేసుకున్నట్టు ఈవెంట్లు నిర్వహిస్తున్నారు.అయితే ఆ ఈవెంట్లు ప్రేక్షకులను ఆకర్షించినా సెలబ్రిటీలకు కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయి.
గతంలో సుధీర్ రష్మీ పెళ్లి చేసుకున్నట్టు ఒక టీవీ షో ఈవెంట్ నిర్వహించగా తాజాగా నవ్యస్వామి, రవికృష్ణ పెళ్లి చేసుకున్నట్టు ప్రోమో వదిలి శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో నిర్వహించారు.
ఈటీవీ ప్రసారమవుతున్న నా పేరు మీనాక్షి సీరియల్ లో చాలా సంవత్సరాల నుంచి నటిస్తున్న నవ్య స్వామి స్టార్ మా ఛానెల్ లో ఆమె కథ అనే సీరియల్ లో కూడా నటిస్తున్నారు.
ఆమెకథ సీరియల్ లో నవ్య పాజిటివ్ రోల్ లో నటిస్తుండగా బిగ్ బాస్ సీజన్ 3 ఫేమ్ రవికృష్ణ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు.ఈ సీరియల్ లో ప్రధాన పాత్రల్లో నటించిన రవికృష్ణ నవ్యస్వామి పలు షోలలో కలిసి పాల్గొని సందడి చేశారు.
గతంలో రవికృష్ణ నవ్య స్వామి ప్రేమలో ఉన్నారని కూడా గాసిప్స్ వైరల్ అయ్యాయి.అయితే తాజాగా ఈవెంట్ కోసం రవికృష్ణ నవ్యస్వామి పెళ్లి చేసుకున్నట్టు నటించడంతో మళ్లీ రవికృష్ణ నవ్య మధ్య ఏదో ఉందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.అయితే సోషల్ మీడియాలో వేర్వేరు గాసిప్స్ వైరల్ కావడంతో నవ్య స్వామి స్పందించడంతో పాటు వార్తల గురించి స్పష్టతనిచ్చారు.
రవికృష్ణ తనకు మంచి ఫ్రెండ్ అని.వైరల్ అవుతున్న గాసిప్స్ వల్ల ఫ్యామిలీ ఇబ్బందులు పడుతూ ఉండటంతో స్పష్టతనిస్తున్నానని ఆమె అన్నారు.ప్రస్తుతం కెరీర్ పైనే ప్రధానంగా దృష్టి పెట్టానని వైరల్ అవుతున్న వార్తల వల్ల అమ్మనాన్న ఫీల్ అయ్యారని నేషనల్ మీడియాకు వెల్లడించారు.
నవ్యస్వామి స్పందనతో వైరల్ అవుతున్న గాసిప్స్ ఆగిపోతాయేమో చూడాలి.